Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
50 లక్షలు కోసం: 'పులి' నిర్మాతలపై శ్రీదేవి కంప్లైంట్
చెన్నై : నటి శ్రీదేవి మరో సారి వార్తల్లోకి ఎక్కారు. రీసెంట్ గా విజయ్ 58 వ సినిమాలో చేసి హాట్ టాపిక్ గా మారిన ఆమె మరోసారి ఇదే సినిమా విషయమే వివాదంతో కూడిన వార్తగా మారారు. పులి చిత్ర నిర్మాతపై శ్రీదేవి ఫిర్యాదు తన పారితోషికానికి సంబంధించి రూ.50 లక్షలు చెల్లించలేదని నటి శ్రీదేవి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
సుమారు ఇరవై ఐదు సంవత్సరారల తరువాత తమిళంలో విజయ్ హీరోగా నటించిన పులి చిత్రంలో రాణిగా ప్రధాన పాత్ర పోషించారు. చిత్రం విడుదలయ్యి నెలలు అవుతున్నా పారితోషికంలో రూ.50 లక్షలు ఇంకా బాకీ ఉన్నట్లు , బాకీ పారితోషికం చిత్ర నిర్మాతలు చెల్లించలేదని శ్రీదేవి ముంబాయి సినీ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.
అందులో ఆమె పులి చిత్ర నిర్మాతలకు పలు సార్లు ఫోన్ చేసినా సరైన సమాధానం రాలేదని, తన బాకీ పారితోషికాన్ని చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీదేవి ఫిర్యాదును ముంబాయి నిర్మాతల మండలి తమిళ సినీ నిర్మాతల మండలికి పంపింది.
ఇప్పుడు తమిళ సినీ నిర్మాతల మండలి శ్రీదేవి ఫిర్యాదుపై విచారించనుంది.పీటీ.సెల్వకుమార్, శిబూ తమీన్స్ సంయుక్తంగా నిర్మించారు. శింబుదేవన్ దర్శకుడు. ఇందులో నటించడానికి శ్రీదేవి భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది.