Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘డ్రగ్స్’తో టాలీవుడ్ పరువు గంగలో కలిసింది.. శ్రీయారెడ్డి ఆవేదన
డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్నే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమను కూడా కుదిపేస్తున్నది. ఈ కేసులో ఆరోపణలు వస్తున్న వారందరూ సుపరిచితులు కావడంతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్
డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్నే కాకుండా దక్షిణాది చిత్ర పరిశ్రమను కూడా కుదిపేస్తున్నది. ఈ కేసులో ఆరోపణలు వస్తున్న వారందరూ సుపరిచితులు కావడంతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్, నటి శ్రీయారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. డ్రగ్ కేసు టాలీవుడ్పై పరువుపోయింది అని ఆమె వ్యాఖ్యానించడం గమనార్హం.
విశాల్ సోదరుడిని పెళ్లి చేసుకొని..
శ్రీయారెడ్డి అమ్మ చెప్పింది, పొగరు చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు. గుణ్ణం గంగారాజు తీసిన అమ్మ చెప్పింది చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్గా నటించారు. కెరీర్ పీక్లో ఉండగానే నటుడు విశాల్ సోదరుడిని వివాహం చేసుకొని పరిశ్రమకు దూరమయ్యారు.
తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై
తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా అండవ కానోమ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఈ చిత్రం సెన్సేషనల్గా మారింది. ఈ చిత్రానికి అవార్డులతోపాటు కలెక్షన్ల రివార్డులు కూడా వచ్చే అవకాశముందనే మాట వినిపిస్తున్నది.
డ్రగ్ మాఫియాలో చిక్కుకోవడం
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న శ్రీయారెడ్డి చెన్నైలోని అడయార్లో కొత్తగా ప్రారంభించిన లిటిల్ ఫ్యాక్టరీ అనే పిల్లల బొమ్మల దుకాణం ప్రారంభోత్సవంలో శ్రియారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. టాలీవుడ్ డ్రగ్స్ మాఫియాలో చిక్కుకోవడం దురదృష్టకరం. డ్రగ్స్ వ్యవహారంతో తెలుగు పరిశ్రమ పరువు పోయింది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగులో మళ్లీ నటిస్తాను..
అండావ కానోమ్తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలుగులో అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని శ్రీయారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె పలువురు అనాథ పిల్లలకు ఉచితంగా బొమ్మలు అందజేసి కొద్దిసేపు వారితో గడిపారు.
ఆగస్టు 11న విడుదల
అండావ
కానోమ్
సినిమాకు
జే
సతీష్
కుమార్
నిర్మాతగా
వ్యవహరిస్తున్నారు.
లియోవిజన్
సంస్థ
రాజ్కుమార్,
జేఎస్కే.ఫిలిం
కార్పొరేషన్
సతీష్కుమార్
కలిసి
ఈ
సినిమాను
రూపొందిస్తున్నారు.
వేల్మది
దర్శకత్వం
వహించిన
ఈ
చిత్రంలో
విజయ్సేతుపతి
కీలక
పాత్రలో
నటించారు.
ఈ
చిత్రానికి
అశ్వమిత్ర
సంగీతాన్ని
అందించారు.
తన
అంచనాలు
కరెక్ట్గా
అయితే
అండవ
కానోమ్
చిత్రం
ఈ
ఏడాది
జాతీయ
అవార్డుల
పట్టికలో
చోటు
సంపాదించుకుంటుందని
నిర్మాత
జే
సతీష్
కుమార్
అన్నారు.
అంతేకాదు
ఈ
సినిమాను
ఆగస్టు
11న
రిలీజ్
చేసేందుకు
ప్లాన్
చేస్తున్నారు.