Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'ది అన్బ్రేకబుల్' గా హీరో సూర్య
వాస్తవానికి కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించిన ఈ చిత్రం పరాజయాన్నే చవిచూసింది. 'గజిని', 'సింగం' హిందీ రీమేక్లు విజయం సాధించిన నేపథ్యంలో బాలీవుడ్లో ఓ నేరు చిత్రం ద్వారా మెరవాలనే ఆలోచనకు వచ్చారట సూర్య. ముందస్తు ప్రయత్నంగా 'బ్రదర్స్'తో సిద్ధమయ్యారట. గతంలో వర్మ దర్శకత్వంలో రూపొందిన రక్త చరిత్ర ద్వారా బాలీవుడ్ కు వచ్చారు. కానీ సినిమా పరాజయం పొందటంతో అక్కడ ఎంట్రీ ఇచ్చి తదుపరి ఆఫర్స్ పట్టలేకపోయారు.
తమిళంలో అగ్రహీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు సూర్య. తెలుగులోనూ స్థిరమైన మార్కెట్ దక్కించుకున్నారు. తాజా సూపర్హిట్ 'సింగం-2'తో మలయాళంలోనూ పాగా వేశారు. ఈ చిత్రం కేరళలోనూ సూపర్హిట్ అయింది. అక్కడి ప్రేక్షకుల్లో సూర్యకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఆయన 'మాట్రాన్' ద్వారా హిందీ ప్రేక్షకులను కూడా పలకరించనున్నారు.
ఇక 'సింగం 2' విజయం తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్లో గౌతం మీనన్ సినిమాలో నటించనున్నట్లు ప్రారంభంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా స్క్రిప్టు మారడంతో తప్పుకున్నాడు సూర్య. రూ.5 కోట్ల పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం. లింగు స్వామితో అనుకున్న సినిమా ఆగిన వెంటనే లింగుస్వామి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్ డ్రాగన్ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్ సంతోష్శివన్ తెలిపారు. ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.