twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్ ,కలాం లకు ప్రత్యేక చిత్ర ప్రదర్శన

    By Staff
    |

    Vannathupoochi
    తరాల మథ్య అంతరాలను చర్చిస్తూ దర్శకుడు సి.అజగప్పన్ రూపొందించిన ప్రతిష్టాత్మక తమిళచిత్రం 'వనతుపూచి'. ఈ చిత్రం తమిళనాడులో రిలీజు ముందే చర్ఛనీయాంశంగా మారింది. ఈ నేపద్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంల కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

    ఇటీవల మానసికవైకల్యత కలిగిన పిల్లలపై అమీర్‌ఖాన్‌ రూపొందించిన 'తారే జమీన్ పర్' చిత్రం అనూహ్యంగా సంచలన విజయం సాధించి అందరి ప్రశంసలను అందుకుంది. ఇక కలాంలకు పిల్లల పట్ల ఎంతో ప్రేమాభిమానాలను కలిగి ఉన్నారనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఇరువురికి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలన్నది దర్శకుడు అజగప్పన్ అభిప్రాయం.

    కథ ప్రధానంగా ఓ తాతకు... మనుమరాలి మధ్య జరిగుతుంది. వారి మధ్య చోటుచేసుకునే అంతరాలు ఉద్వేగ భరితంగా ఉంటాయి. ఈ సన్నివేశాలే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా చిత్రీకరించారు. నటుడు బాలాసింగ్ తాతగా నటించగా, తొమ్మిది సంవత్సరాల శ్రీ లక్ష్మీ పెదమనుమరాలి పాత్రలో జీవించింది. నటి రేవతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించగా, ఆముద భారతి కూడా ఓ పాత్రలో నటించింది. రేహెన్ స్వరకల్పన చేశారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X