Don't Miss!
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ట్రాన్స్ జెండర్స్ తరుపున నిలబడిన స్టార్.. వారు కూడా మనుషులే.. కాస్త దయచూపండన్న వరలక్ష్మి
కరోనా వైరస్ ఎందరి జీవితాలను చిధిమేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. కరోనా మహమ్మారిని ఎదురించేందుకు విధించిన లాక్ డౌన్ ఏ మాత్రం ఉపయోగపడలేదు. కానీ ఆ సమయంలో ఎంతో తిండి లేక అల్లలాడిపోయారు. ఇప్పటికీ లాక్ డౌన్ దెబ్బ తగ్గడం లేదు. ఎంతో మంది ఆకలికేకలతో అలమటిస్తున్నారు.
ట్రాన్స్ జెండర్స్ కోసం.
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కరువై తిండికి కూడా కొట్టుమిట్టాడుతున్న వారి తరపున వరలక్ష్మీ శరత్ కుమార్ నిలిచింది. ట్రాన్స్జెండర్ హక్కుల కోసం పోరాడే కార్యకర్త గ్రేస్ భాను లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఎంతో శ్రమిస్తోందని తెలిపింది. తూత్తుకుడిలోని ఎంతో మందికి సాయం చేస్తూ నిర్విరామంగా పని చేస్తోందని చెప్పుకొచ్చింది. వారికి కావాల్సిన నిత్యావసర సరకులు, మందులు అందిస్తోందని పేర్కొంది.
నిధులు అయిపోయాయ్..
మొదటగా క్రౌడ్ ఫండింగ్ విధానం ద్వారా సాయం చేయడం జరిగిందని తెలిపింది. కానీ ఇప్పుడు నిధులు అయిపోయాయని, మీ అందరి సాయం కోసం వారంతా ఎదురుచూస్తున్నారని చెప్పుకొచ్చింది. వారి ఇంటి అద్దె, రేషన్ కోసం సాయం చేయండని కోరింది. తమిళ నాడులో ఉన్న దాదాపు 200 మంది ట్రాన్స్జెండర్స్క సాయం చేయండని పిలుపునిచ్చింది.
అద్దె, రేషన్ కోసం..
కోవిడ్కు వ్యతిరేకంగా పోరాడేందుకు విధించిన మూడు నెలల లాక్ డౌన్ పూర్తయ్యాక వారి యోగక్షేమాలను గాలికొదిలేశారు. ప్రభుత్వ సహాయక చర్యలు అందడం లేదు. ఇంటి యజమానులు అద్దెలు అడగడం ప్రారంభించారు. రేషన్ కూడా వారికి అందడం లేదు. వారికి పైగా ఎలాంటి గుర్తింపు కార్డులు కూడా ఉండవు.
Recommended Video
కాస్త దయచూపండి..
వీరే కాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు. వృద్దులు, హెచ్ఐవీ రోగులు, జానపద కళాకారులు ఇలా ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ వల్ల ఉపాధిని కోల్పోయినవారెంతో మంది ఉన్నారు. వీధి కార్మికుల జీవితాలు కూడా దుర్భరంగా ఉన్నాయి. వీరందరినీ కాపాడేందుకు మీకు తోచిన మొత్తం అది కొంచమే అని మీకు అనిపించినా పర్లేదు.. ఎంతో కొంత సాయం చేయండని కోరింది. వారు కూడా మనుషులే కాస్త దయచూపండని, మానవత్వాన్ని చాటుకోండని చెప్పుకొచ్చింది.