ఆ హీరో ప్లేబోయ్ కాదని సర్టిఫై చేస్తోందా హీరోయిన్
తమిళంలో శింబుకి ప్లేబోయ్ అని పెద్ద పేరు. మిగతా హీరోలు కాస్త చాటుగా చేసే పనని చెప్పి మరి చేస్తూండే రకం శింబు. అయితే అతను అలాంటివాడు కాదని సర్టిఫై చేస్తోంది కొత్త హీరోయిన్ వరలక్ష్మి. వరలక్ష్మి మరెవరో కాదు తమిళంలో ఓ వెలుగు వెలిగిన హీరో శరత్ కుమార్ కూతురు. వరలక్ష్మి తమిళంలో 'పోడా పోడి" అనే చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమవుతోంది. శింబు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి విఘ్నేష్ శివ దర్శకత్వం వహిస్తున్నారు.
శింబు గురించి చెబుతూ ఆమె.. శింబు వివాదాస్పద హీరో అని, ప్లే బోయ్ అని అతని సరసన నటించడం రిస్క్ అని చాలామంది అంటుంటారు. కానీ ఆ మాటలు నిజం కాదు. సినిమాకి సంబంధించిన ప్రతి శాఖ గురించి ఆయనకు అవగాహన ఉంది. మ్యూజిక్, కెమెరా యాంగిల్స్.. ఇలా అన్నింటిలోనూ శింబు ఎక్స్పర్ట్. అలాంటి ప్రతిభ గల హీరో సరసన నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది.


Click it and Unblock the Notifications











