Don't Miss!
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫ్యాన్స్పై విజయ్ సేతుపతి ఫైర్.. ఇదేం అభిమానం అంటూ మండిపాటు
వరుస విజయాలతో, అద్భుతమైన నటనతో ఆకట్టుకొంటున్న విజయ్ సేతుపతి కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. తుగ్లక్ దర్బార్ అనే సినిమా శనివారం చెన్నైలో ప్రారంభమైంది. గాయత్రి, అదితి రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాళ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమానికి విజయ్ సేతుపతి, అధితి, గాయత్రి, పార్తీపన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటనపై విజయ్ సేతుపతి అసంతృప్తికి లోనయ్యాడని చెన్నై సినీ మీడియా కథనాలు వెల్లడించింది.
పూజా కార్యక్రమం సందర్భంగా చిత్ర యూనిట్, అభిమానులు భారీ ఎత్తున్న పటాకాయలు పేల్చారు. అభిమానులను వద్దని చెప్పినా వినకుండా అదే తీరును కొనసాగించడంతో మందలించాడట. అయినా అదే జోష్ను కొనసాగించడంతో విజయ్ సేతుపతికి చిర్రెత్తుకొచ్చిందట. ఇలాంటి పనులను ఇక ముందు చేయవద్దని చెప్పారట. పటాసులు కాల్చడం ఎవరి ఐడియానో ఏమో తేలిదు కానీ.. నేను చాలా అప్సెట్ అయ్యాను అని అన్నారు.
విజయ్ సేతుపతి నటించిన ఇదమ్ పొరుల్ ఇవల్, సంగా తమిజాన్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే కడైసి వివసాయి, లాబమ్, సైరా నర్సింహరెడ్డి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక అదితి రావు తాజాగా అంతరిక్షం అనే చిత్రంలో నటించింది. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ నటించే చిత్రంలో కనిపించబోతున్నది.