Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
పరువు పోయిందిగా... అందుకే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ!
హైదరాబాద్: సినిమా వాళ్లు రాజకీయాలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఇందులో సక్సెస్ అయింది కొందరు మాత్రమే. వెండి తెరపై నెం.1 స్టార్లుగా వెలిగిన కొందరు రాజకీయాల్లో మాత్రం అంతగా రాణించలేక పోతున్నారు.
రాజకీయాల్లో పరాజయం పాలై పరువు పొగొట్టుకున్న స్టార్స్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం లాంటి ఇటీవల చూస్తూనే ఉన్నాం. తాజాగా తమిళ స్టార్ విజయ్ కాంత్ కూడా ఇదే బాట పడుతున్నారు.
ఒకప్పుడు తమిళనాట స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన విజయ్ కాంత్ తర్వాత రాజకీయల్లోకి వెళ్లడం, ద్రవిడ మున్నేట్ర కళగం అనే పార్టీ పెట్టి, 2011 తమిళనాడు ఎన్నికల్లో 29 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అవుతాననే ధీమాతో వీర్రవీగిన విజయ్ కాంత్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. పైగా తాను పోటీ చేసిన నియోజకవర్గంలో డిపాజిట్ కూడా దక్కించుకోకుండా పరువు పోగొట్టుకున్నారు.
ప్రస్తుతం రాజకీయాలు చేసే పరిస్థితి లేక పోవడంతో సినిమాల్లో నటించడం ద్వారా కనీసం తన గుర్తింపును కాపాడుకోవాలని డిసైడ్ అయ్యాడు. ప్రస్తుతం మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ విషయాన్ని విజయ్ కాంత్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మన విజయం మరికొంత ఆలస్యం అవుతోంది. ధైర్యాన్ని కోల్పోవద్దు. మనం అధికారాన్ని చేపడతాం. ప్రస్తుతం తాను తమిళన్ ఎండ్రు సోల్ చిత్రం మీద ఫోకస్ పెట్టినట్లు తెలిపారు.