Just In
Don't Miss!
- News
బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్
- Finance
బంగారం ధర పెరిగింది, కానీ ఆ మార్క్కు దిగువనే: రూ.66,300 వద్ద వెండి ధరలు
- Sports
శెభాష్ సిరాజ్.. నీ ఆటను చూసి మీ తండ్రి గర్వపడుతాడు: మంత్రి కేటీఆర్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
శత్రువులుగా మారిన స్టార్ హీరోలు.. విశాల్-ఆర్య మధ్య పోరు
ఇద్దరు హీరోలను, అది కూడా మంచి నటులను ఒకే సినిమాలో పెట్టాలంటే కంటెంట్ ఏ రేంజ్లో ఉండాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే విశాల్ ఆర్య వంటి హీరోలతో వాడు వీడు అనే సినిమాను తీశాడు దర్శకుడు బాలా. అది తెలుగులో అంతగా వర్కవుట్ కాకపోయినా కోలీవుడ్లో క్లిక్ అయింది. అలాంటి చిత్రం తరువాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి ఓ చిత్రంలో నటించబోతోన్నారు.
అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఈ మూవీ షూటింగ్ను ఓ పదిహేను రోజుల పాటు ఇక్కడే రామోజీ ఫిలీం సిటీలో షూట్ చేశారు. మొదటి షెడ్యూల్ను సక్సెస్ ఫుల్గా పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ తాజాగా ఓ అప్డేట్ను ప్రకటించారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ను తాజాగా రివీల్ చేశారు. ఎనిమీ అంటూ ఇద్దరి ఫోటోలను ఆ టైటిల్ లోగోలో పెట్టేశారు. అందులో ఈ ఇద్దరు శత్రువుల్లా మారి పోట్లాడేందుకు రెడీగా ఉన్నట్టు వారి కంటి చూపు చెబుతోంది.

నా బెస్ట్ ఫ్రెండ్ ఆర్య.. ఇప్పుడు నా ఎనిమీ అయ్యాడు అంటూ విశాల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది.. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇద్దరి మధ్య జరిగే పోరాటం చాలా బాగుండబోతోందని విశాల్ తెలిపాడు. ఈ సినిమాలో ఆర్య విలన్గా నటించబోతోన్నాడు. ఓ హీరోయిన్గా మృనాళిని రవిని ఫిక్స్ చేశాం.. మరో ఫీమేల్ లేడీ ఫిక్స్ చేయాల్సి ఉందని చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ తెలిపాడు.
