Don't Miss!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అమీర్ ఖాన్ షోలో పాల్గొన్నందుకే హత్య చేసారా?
ఇలాంటి వాటిపై చైతన్యం కల్పించడంతో పాటు, దేశంలోని కొన్ని ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా చేపట్టి కార్యక్రమం 'సత్యమేవ జయతే'. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా ప్రసారమైన ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ కార్యక్రమంలో ప్రస్తావనకు వచ్చిన పలు అంశాలపై ప్లార్లమెంటు కూడా స్పందించిందంటే విషయం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా....'సత్యమేవ జయతే' కార్యక్రమానికి అభిమానులుగా ఉన్న వారికి ఓ బ్యాడ్ న్యూస్. 'సత్యమేవ జయతే' కార్యక్రమం ద్వారా కాప్ పంచాయతీ(కుల పంచాయితీ)లకు వ్యతిరేకంగా గళం విప్పిన అబ్దుల్ హకీం అనే వ్యక్తిని కొందరు దుండగులు దారుణంగా తుపాకితో కాల్చి హత్య చేసారు. గర్భవతి అయిన తన భార్యకు డాక్టర్ వద్ద నుంచి మందులు తీసుకెలుతుండగా... ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాప్ పంచాయితీల వ్యవహారాలపై వ్యతిరేక గళం విప్పినందుకే అతన్ని హత్య చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ విషయమై అమీర్ ఖాన్ స్పందిస్తూ...'ఈ సంఘటన సత్యమేవ జయతే టీంను ఎంతో బాధించిందని, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అతని కుటుంబాన్ని ఆదుకుని రక్షణ కల్పించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు' తెలిపారు.