Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఉదయభాను ఓవర్ యాక్షన్ తగ్గించాలంటున్నారు
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ ఉదయ్ భాను ప్రస్తుతం పొలిటీషియన్స్ ని నిలదీయమంటూ టీవీ 9 ఛానెల్ కు ఓ పోగ్రాం చేస్తోంది. ఆ పోగ్రాం పేరు నిగ్గదీసి అడుగు. ఈ పోగ్రాం ద్వారా ఆమె రాజకీయనాయుకులపై అవగాహన పెంచనుంది. తెలంగాణా, ఆంధ్రా,రాయలసీమ ఎక్కడైనా ప్రజలే బాధితులు...మాట తప్పే నాయకులను సహించవద్దు...మీ కష్టాలను నాతో చెప్పండంటూ ముందుకు వస్తోంది. ఈ పోగ్రాం నిమిత్తం ఆమె సామాన్యులను కలుస్తోంది. అందుకోసం ఆమె టూర్ వేస్తోంది. అయితే అంతా బాగానే ఉన్నా పోగ్రాంలో మరీ నాటకీయత పాలు ఎక్కువైపోతోందని, ఉదయభాను ఓవర్ యాక్షన్ లా మరిందని విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి.
మంచి పోగ్రామ్ ని ఉదయభాను ఇలా నీరుకారుస్తోందని అంటున్నారు. అలాగే కార్యక్రమం కాన్సెప్టు వైజ్ గా బాగున్నప్పటికీ ఆoమె కొంచెం డ్రామా తగ్గిస్తే ఎబ్బెట్టుగా ఉండటం తగ్గుతుందంటున్నారు. ముఖ్యంగా కొన్ని పడిగట్టుపదాలు...అన్యాయం, అక్రమం, నిర్లక్ష్యం,నిరాదరణ వంటి వాటి వాడకం తగ్గించాలని అంటున్నారు. దానికి తోడు ఆమె క్రింద స్ధాయిలో ప్రజా సమస్యలను అవగాహన చేసుకుని వెళ్తే నవ్వులు పాలు కాకుండా ఉండే అవకాసం ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకూ ఈ పోగ్రాం లో భాగంగా అనంతపూర్, ఖమ్మం, అదిలాబాద్, కర్నూలు, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాలు పర్యటించి కార్యక్రమం నిర్వహించారు.

ఇక గత కొంత కాలంగా రాజకీయాల్లోకి వస్తుందంటూ ప్రచారం సాగుతున్న టీవీ యాంకర్, నటి ఉదయభాను ఈ పోగ్రామ్ తో కంక్లూజన్ కి వచ్చినట్లే అంటున్నారు. మారిన రాష్ట్ర పరిస్థితులు, తెలంగాణ ఏర్పాటు వంటి కారణాలతో ప్రస్తుతం రాజకీయ రంగమంతా గందరగోళంగా మారింది. ఈ సమయాన్నే తన రాజకీయ రంగ ప్రవేశానికి వేదిక చేసుకోవాలని భాను నిర్ణయించుకుందని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని తేలింది.
అయితే గతంలో పలు విషయాల్లో మీడియాకెక్కిన భాను ఒక దశలో అవసరమైన సమయంలో రాజకీయ రంగంలోకి వస్తానని ఇదివరకే చెప్పింది. దీంతో ప్రస్తుతం వివిధ పార్టీలు ఆమెను తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నాయట. అయితే ఈ విషయంలో మాత్రం ఆమె ఆచితూచి అడుగేయాలని నిర్ణయించుకుందట.