గుర్తు పట్టలేం: రియాలిటీ షో లో అమలాపాల్ (ఫొటోలు)
చెన్నై : 2014 లో వివాహం చేసుకున్న అమలాపాల్ తాజాగా తమిళ ఛానెల్ సన్ టీవీలో ఓ రియాలిటీ షో చేయటానికి కమిటైన సంగతి తెలిసిందే. సెవర్ అప్ " స్టార్టర్స్ "పేరుతో ప్రసారం కానున్న రియాలిటీ షో కు జడ్జిగా చేస్తోంది. ఆమెతో పాటు తమిళ నటుడు శివ కూడా జడ్జిగా పాల్గొంటున్నారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఈ రియాలిటీ షో లో...కొత్త వారి టాలెంట్స్ ను సింగింగ్, డాన్సింగ్, నటనలో ప్రదర్శిస్తారు. వాటిలో ఉత్తమంగా చేసిన వారిని ఎంపిక చేసి, ఎంకరేజ్ చేస్తారు. ఈ పోగ్రామ్ రీసెంట్ గా ప్రారంభమైంది. ఈ పోగ్రామ్ లో ఆమెను చూసినవారు అసలు గుర్తు పట్టలేకపోయారు. ఆమె గుర్తపట్టలేనంతగా మారిపోయిందే వ్యాఖ్యలు వినిపించాయి. మీరూ ఆ ఫొటోలూ చూడండి.
ఇక ఈ రియాలిటీ షో తో మళ్లీ తను ఫామ్ లోకి వస్తానని అమలా పాల్ అంటోది. అలాగే అప్పట్లో కమిటైన సినిమాలు పూర్తి చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కానీ మారిన రూపంతో ఎలా అమలాపాల్ ముందుకు వెళ్తుందనేది చూడాలి.

తెలుగులో స్టార్
రామ్చరణ్, అల్లు అర్జున్ ల వంటి మెగా హీరోల సరసన నటించే అవకాశం అందుకోగానే... ఇక అమలాపాల్ తారా స్దాయికి వెళ్లిపోతుందన్నారంతా.

కానీ...జరగలేదు
తెలుగులో ఇక స్టార్ హీరోల సరసన నటిస్తూ హల్చల్ చేయబోతోందని ఊహించారు. కానీ... అందరూ అనుకొన్నట్టుగా ఏమీ జరగలేదు.

కలిసిరాలేదు
`నాయక్` హిట్టైనా... ఆమెకు ఒరిగిందేమీ లేదు. ఆ క్రెడిట్ మొత్తం రామ్చరణ్ ఖాతాలోకి వెళ్లిపోయింది.

అల్లు అర్జున్ తో చేసినా
ఆ తర్వాత అల్లు అర్జున్ తో చేసిన `ఇద్దరమ్మాయిలతో` ఆడలేదు. దీంతో అమలాపాల్ని అవకాశాలు వరించలేదు. వేరే దారిలేక తమిళంవైపు దృష్టిపెట్టింది. మధ్యలో సముద్రఖని పుణ్యాన తెలుగులో నాని సరసన `జెండాపై కపిరాజు`చిత్రంలో మాత్రమే నటించింది.

ఇప్పుడు ఒప్పుకుంటుందా
హీరోయిన్ గా కాకుండా వేరే ఇతర ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఆమె ఒప్పుకుంటుందా అనే చర్చ నడుస్తోంది

గ్లామర్ తగ్గలేదు
వివాహం అయినా ఆమెలో కొంచెం కూడా గ్లామర్ తగ్గలేదు..హీరోయిన్ గా మళ్లీ ట్రై చేయవచ్చు అని ఫ్యాన్స్ అంటున్నారు.


Click it and Unblock the Notifications











