Bigg Boss Telugu 6 తుప్పాస్ సంచాలకులు.. శ్రీసత్య పై ఉమ్మేసిన కీర్తి
బిగ్ బాస్ 'టికెట్ టు ఫినాలే' టాస్క్ ఎంతో ఆసక్తిగా కొననసాగుతోంది. అసలైతే ఇప్పటికే ఈ టాస్క్ పూర్తయింది. కానీ ఎపిసోడ్స్ గా జనాలకు ఈ టాస్క్ లను చూపిస్తున్నారు. ఇందులో ఆదిరెడ్డి విజేతగా నిలిచి ఫైనల్ కు చేరిపోయాడు. ఇక గురువారం నాటి ఎపిసోడ్లోనూ 'టికెట్ టు ఫినాలే'లో భాగంగా రెండు టాస్క్లు చూపించగా అందులో రేవంత్, కీర్తి ప్రవర్తించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా కీర్తి అయితే శ్రీసత్యపై ఉమ్మేసినట్లు కామెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

శ్రీహన్ విన్నర్
బేబీ రోల్ బేబీ అనే టాస్క్ లో కీర్తి, శ్రీహన్, ఫైమా, రోహిత్ పాల్గొన్నారు. రోల్ అవుతూ ఇచ్చిన బ్రిక్స్ ని టవర్ తరహాలో ఒక దానిపై మరొకటి పెట్టాల్సి ఉంటుంది. ఇక అందరూ కూడా ఈ ఆటలో చాలా కటినంగా కష్టపడ్డారు. ఇక చివరలో శ్రీహన్ తెలివిగా గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. ఇక సంచాలకులుగా ఉన్న ఇనయా శ్రీ సత్య కొంత సేపు చర్చించిన తరువాత ఆ టాస్క్ లో శ్రీహన్ విన్నర్ అని చెప్పారు.

పొరపాటు ఉందని వాదన
ఇక శ్రీహన్ సరిగ్గా ఆడలేదు అని అందులో ఒక పొరపాటు ఉందని కీర్తి వాదించింది. ఇక ఈయన శ్రీ సత్య ఇద్దరు కూడా మెల్లగా కొంతసేపు చర్చించిన తర్వాత మళ్లీ మరోసారి శ్రీహాన్ మొదటి స్థానంలో నిలిచాడు అని చెప్పేసారు. అయితే మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరు కూడా ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ కీర్తి మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. ఎవరైనా సరే టవర్ ను అలా పెడతారా అని బిగ్ బాస్ ఇచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడింది. అసలు బిగ్ బాస్ ఏం చెప్పాడో ఒకసారి చూడండి అని కూడా కీర్తి చెప్పుకొచ్చింది.

కీర్తి ఎంత చెప్పినా కూడా
ఇక కీర్తి ఎంత చెప్పినా కూడా శ్రీ సత్య శ్రీహాన్ విన్నర్ అనే తేల్చేయడంతో ఆమె ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసింది. తన బెడ్ దగ్గరకు వెళ్లి ఆమె కొంత డిప్రెషన్ కు లోనయింది. అంతేకాకుండా వాళ్లు కలిసి గేమ్ ఆడుతున్నారు అనే విధంగా ఆమె కామెంట్ కూడా చేసింది. ఎప్పుడు చూసినా కూడా శ్రీ సత్య అయితే శ్రీహన్ వెంటే పడుతుంది అని ఇక్కడ కూడా అతనికి సపోర్ట్ చేసినట్లుగా ప్రవర్తించింది అని తనలో తానే మాట్లాడుకుంది.

తుప్పాస్ సంచాలకులు
ఇక నచ్చిన వాళ్లకు గేమ్ ఇచ్చేస్తే మనం ఎందుకు ఆడాలి. ఎవరైనా సరే ఈజీగా చెప్పగలరు అసలు టవర్ ఉంటే ఎలా ఉండాలి బేస్మెంట్ ఎలా ఉండాలి అని.. అది కూడా పట్టించుకోవడం లేదు. తుప్పాస్ సంచాలకులు. ఎంత కష్టపడినా కూడా ఇక్కడ ఏమీ వ్యాల్యూ ఉండదు. తూ.. ఇలాంటి జనాల మధ్యలో ఉన్నాను. ఎంత కష్టపడినా కూడా వీళ్ళకి ఎందుకు కనిపించదు. తూ.. అంటూ శ్రీ సత్య గురించి కీర్తి అయితే తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది.

శ్రీహన్ ముందే తన్నేసిన కీర్తి
ఇక అలాంటి గేమ్ ఆడినప్పటికీ కూడా కీర్తి ఏమాత్రం తనకి తగ్గకుండా తనకు తానే మోటివేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేసింది. అయినా వీళ్ళు ఒక పాయింట్ అటు ఇటు మార్చినంత మాత్రాన నేను ఏమాత్రం వెనక్కి తగ్గను అని చెప్పుకుంది. ఇక తర్వాత శ్రీ సత్య మాట్లాడేందుకు వచ్చినప్పటికీ కూడా కీర్తి ఒప్పుకోలేదు. ఇక ఆ తర్వాత శ్రీహన్ కూడా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కీర్తి తను పేర్చిన బ్రిక్స్ లో తన్నేసి వెళ్ళిపోయింది. మరి కీర్తి శ్రీ సత్య శ్రీహాన్ పై తదుపరి రౌండ్స్ లో ఎలా రివెంజ్ తీర్చుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











