Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఏప్రియల్ 1 నుంచి టీవీలు బంద్!
సెట్-టాప్-బాక్సులు లేనిదే ఈ ప్రాంతాల్లో టీవీ కార్యక్రమాలను వీక్షించడం కుదరదని ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫెడరేషన్ (ఐబీఎఫ్) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా సగటున 67 శాతం, హైదరాబాద్, అమృత్సర్, చండీగఢ్ అలహాబాదుల్లో నూరుశాతం డిజిటలీకరణ పూర్తయినట్లు సమాచార ప్రసారశాఖ మంత్రి మనీష్ తివారి మరో ప్రకటనలో తెలిపారు.
ఇన్నాళ్లూ టీవీ ప్రసారాలు రూపసృష్టి సంకేతాల (అనలాగ్ సిగ్నళ్ల) రూపంలో చేరేవి. ఇప్పుడు వాటి స్థానంలో సంఖ్యారూప సంకేతాలు (డిజిటల్ సిగ్నళ్లు) రానున్నాయి. సెట్-టాప్-బాక్సులు లేనిదే ఈ కొత్త సంకేతాలను టీవీలు అర్థం చేసుకోలేవు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రచారం చేపట్టింది. మొత్తం 1.60 కోట్ల సెట్-టాప్-బాక్సులను ఏర్పాటుచేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 1.08 కోట్ల బాక్సులు ఏర్పాటైనట్లు మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.