twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏప్రియల్ 1 నుంచి టీవీలు బంద్‌!

    By Srikanya
    |

    Cable digitisation: ‘Deadline may not be extended'
    న్యూఢిల్లీ: ఏప్రియల్ 1 వ తేదీ నుంచి చాలా టీవీలు బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెట్‌-టాప్‌-బాక్సులు లేని టీవీల్లో సోమవారం నుంచి 'చుక్కలు' కనిపిస్తాయి. డిజిటలీకరణ ప్రక్రియలో భాగంగా రెండో దశలో హైదరాబాద్‌, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా 38 నగరాల్లో మార్చి 31 తర్వాత కేవలం డిజిటల్‌ ప్రసారాలు మాత్రమే ఉంటాయి.

    సెట్‌-టాప్‌-బాక్సులు లేనిదే ఈ ప్రాంతాల్లో టీవీ కార్యక్రమాలను వీక్షించడం కుదరదని ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫెడరేషన్‌ (ఐబీఎఫ్‌) మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశ వ్యాప్తంగా సగటున 67 శాతం, హైదరాబాద్‌, అమృత్‌సర్‌, చండీగఢ్‌ అలహాబాదుల్లో నూరుశాతం డిజిటలీకరణ పూర్తయినట్లు సమాచార ప్రసారశాఖ మంత్రి మనీష్‌ తివారి మరో ప్రకటనలో తెలిపారు.

    ఇన్నాళ్లూ టీవీ ప్రసారాలు రూపసృష్టి సంకేతాల (అనలాగ్‌ సిగ్నళ్ల) రూపంలో చేరేవి. ఇప్పుడు వాటి స్థానంలో సంఖ్యారూప సంకేతాలు (డిజిటల్‌ సిగ్నళ్లు) రానున్నాయి. సెట్‌-టాప్‌-బాక్సులు లేనిదే ఈ కొత్త సంకేతాలను టీవీలు అర్థం చేసుకోలేవు. ఈ విషయమై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రచారం చేపట్టింది. మొత్తం 1.60 కోట్ల సెట్‌-టాప్‌-బాక్సులను ఏర్పాటుచేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటివరకు 1.08 కోట్ల బాక్సులు ఏర్పాటైనట్లు మంత్రి తన ప్రకటనలో పేర్కొన్నారు.

    English summary
    Calling first phase of cable digitisation a success, Information and Broadcasting Minister Manish Tiwari seeks support for the second phase.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X