Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ పై కేసు నమోదు
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ పై జూబ్లి హిల్స్ పోలిస్ స్టతిఒన్ లో చీటింగ్ కేసు నమోదైంది
కమెడియన్ ముక్కు అవినాష్ పై పోలీస్ కేసు నమోదైంది. శివరాత్రి పండుగ రోజున ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి, ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడంటూ వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి అవినాష్ పై హైదరాబాదు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రోగ్రామ్ కోసం రూ. 10 వేలు కూడా అడ్వాన్స్ గా తీసుకున్నాడని... ప్రోగ్రామ్ కు మాత్రం రాలేదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు అవినాష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు టీవీ ఎంటర్టెన్మెంట్ రంగంలో జబర్దస్త్ పాపులర్ అయినంతగా మరే కామెడీ షో కూడా పాపులర్ కాలేదు. నాగబాబు, రోజా జడ్డిజలుగా, అనసూయ, రష్మి యాంకర్లుగా.... వివిధ కామెడీ టీమ్స్ తెలుగు ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచుతున్నారు.
జబర్దస్త్ ప్రోగ్రాంతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్న కమెడియన్స్ ఇప్పుడు స్టార్స్ గా మారారు. బోలెడంత క్రేజ్ తో పాటు ఒక్కొక్కరిగా సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అంతగా పాపులర్ అయిన వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం చేస్తున్నా అక్కడ జబర్దస్త్ బ్యాచ్ ప్రత్యక్షమవుతుంది. అయితే ఇంత పాపులారిటీ తెచ్చుకుంటున్న కమేడియమ్న్లు కొన్ని సార్లు వివాదాల్లో ఇరుక్కోవటం కూడా మామూలే అయ్యింది.
గతంలో 'జబర్దస్త్'లో ప్రసారమైన ఒక ఎపిసోడ్ న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా ఉందంటూ న్యాయవాది అరుణ్ కుమార్ ఈమేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు 'జబర్దస్త్' టీంకు నోటీసులు జారీ చేసింది. కాగా, 'జబర్దస్త్' షోపై గతంలో గౌడ విద్యార్థి సంఘం ఉస్మానియా యూనివర్శిటీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
డిసెంబర్ 2014లో ప్రసారమైన ఓ ఎపిసోడ్ కల్లుగీత కార్మికులను, గౌడ మహిళలను కించపరిచేలా ఉందని విద్యార్థి సంఘం నేతలు ఆరోపించారు. aa కేసు నుండి ఇటీవలే నాగబాబు, రోజా, రష్మిలకు విముక్తి రాగా, తాజాగా ముక్కు అవినాష్ పై కేసు నమోదు కావడంతో, మరోసారి 'జబర్దస్త్' పేరు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.