ఈ రోజు నుంచి DD-సప్తగిరిఛానెల్ లో...

By Srikanya

DD-Saptagiri to telecast 4 new serials from Jan 13
హైదరాబాద్‌: దూరదర్శన్ లో కొత్త మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ రోజు నుంచి నాలుగు సీరియల్స్ మొదలు కానున్నాయి. ప్రేక్షకులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలు రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దూరదర్శన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ శైలజా సుమన్‌ అన్నారు. మాసాబ్‌ట్యాంకులో ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సప్తగిరి ఛానల్‌లో సంక్రాంతి సందర్భంగా ఈనెల 13 నుంచి ప్రసారం చేయనున్న నాలుగు ధారావాహికలను అధికారికంగా ప్రారంభించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు ఐశ్వర్యకలశం, బృందావనం, శ్రీనివాసకళ్యాణం, మా ఆయన బంగారం ప్రసారం అవుతాయని వివరించారు. కొత్తగా ప్రసారం చేయనున్న ధారావాహికల్లో నటించిన నటీనటులతో పాటు నిర్మాతలు, దర్శకులు ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

మరో ప్రక్క 'సప్తగిరి ఛానెల్'లో ఎప్పుడు ఏ ప్రోగ్రాం వస్తుందో, ఎప్పుడు ఏ ప్రోగ్రాంను చెప్పాపెట్టకుండా తీసేస్తారో చెప్పినవాళ్ళకు బహుమానం ప్రకటించవచ్చు అంటూ సెటైర్స్ వినిపిస్తున్న నేపధ్యంలో ఈ సీరియల్స్ ఏమైనా మార్పులు తీసుకు వస్తాయేమో చూడాలని వీక్షకులు అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X