యూకేలో ఈటీవీ'స్వరాభిషేకం', వివరాలు
హైదరాబాద్ : ఈటీవీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోన్న సంగీత కార్యక్రమం 'స్వరాభిషేకం' బృందం త్వరలో యూకేలో వీనులవిందు చేయనుంది. యూకేలో మూడు ప్రోగ్రాంలు చేయనున్నట్లు స్వరాభిషేకం కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. జులై 11న గ్లాస్గోలో, 12న మాంచెస్టర్లో, 13న లండన్లో నిర్వహించే కార్యక్రమాలకు ప్రముఖ టీవీ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, శ్రీరామచంద్ర, సునీత, ప్రణవి, కల్పన, మాళవిక తమ పాటలతో అలరించనున్నారు. ఈ కార్యక్రమాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునేవారు టిక్కెట్ల కోసం www.swarabhishekam.co.uk అనే వెబ్సైట్లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.



Click it and Unblock the Notifications











