Don't Miss!
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సీరియల్ టైమ్ మార్చాలంటున్నారు
టీవీ కళాకారుడైన రాంబాబు, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ అందరినీ విసిగించే అతని భార్య గంగ, తనకంటే అందమైన వారే లేరనుకునే ఓ సుందరి, ఏనాడు నల్లకోటు వేసుకోని ఒక ప్లీడరు, అందరినీ నవ్విస్తూ ఉండే ఓ రేడియో జాకీ, శ్రీకాకుళం యాసలో మురిపించే గంగ తమ్ముడు సత్తిపండు- ఇలా కేవలం ఐదు పాత్రలతో కడుపుబ్బ నవ్విస్తున్న ఈ సీరియల్కు అభిమానులు కూడా ఎక్కువే.
అమృతం తరువాత ప్రేక్షకుల ఆదరణ ఎక్కువ పొందిన సీరియల్ గంగతో రాంబాబు. విశేషం ఏమిటంటే అమృతంలో పనివాడిగా నటించిన వాసు ఇంటూరి దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. జి తెలుగు ప్రతి రోజు వచ్చే ఈ షో ఆరుగురు చుట్టూనే ఈ సీరియల్ తిరుగుంది. గంగ, రాంబాబు, బిటీ, పితాని, సత్తి, లతిక అనే ఆరు క్యారెక్టర్లను ప్రధానంగా తీసుకుని వాసు ఇంటూరి అద్భుతంగా సీరియల్ను తీస్తున్నారు. మహిళలకే కాకుండా మగవారిని సైతం ఆకట్టుకుంటోంది. ప్రతి రోజు ఏదో ఒక అంశంపై నవ్వుల విందును పంచుతుంటారు.
అయితే, సీరియల్ రాత్రి పదిన్నరకు ప్రసారమవుతుండడంతో చాలామంది మిస్ అవుతున్నారట. జీ తెలుగు వారు ఈ విషయాన్ని గుర్తిస్తారో లేదో చూడాలి. గతంలో 'మై నేమ్ ఈజ్ మంగతాయారు', 'కృష్ణావతారాలు' వంటి హాస్య సీరియల్స్ అందించిన 'జీ తెలుగు' ఇలాంటి మరో కామెడీ సీరియల్ ఎంచుకోవడం అభినందించదగిందే.