Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మానవత్వాన్ని రేప్ చేశారు, ఇంకా ఎంత మంది బలికావాలి: యాంకర్ రష్మి ఆవేదన
ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ ప్రాంతంలో జరిగిన చిన్నారి ట్వింకిల్ శర్మ హత్య ఘటనపై తెలుగు యాంకర్, నటి రష్మి గౌతమ్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇది అత్యంత దారుణమైన ఘటన, ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ హత్య కేసులో నిందితుడు మహ్మద్ జాహిద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్వింకిల్ తల్లిదండ్రులు జాహిద్కు రూ. 10వేల రూపాయలు అప్పు ఉన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ ఈ హత్యకు దారితీసినట్లు భావిస్తున్నారు. చిన్నారి మృతదేహం స్వాధీనం చేసుకునే సమయానికి సగం కాలిపోయి ఉండటంతో పాటు కుక్కలు పీక్కు తింటున్నాయి. అయితే రేప్ జరుగలేదని పోలీసులు స్పష్టం చేశారు.
|
మానవత్వాన్ని రేప్ చేశారు
ట్వింకిల్ శర్మ ఘటనపై రష్మి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.... ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. హౌ వి వండర్ హౌ యు ఆర్ #జస్టిస్ఫర్ట్వింకిల్. కఠినమైన చట్టాలు రావడానికి ముందు ఇంకా ఎంత మంది బలికావాలి. మానవత్వాన్ని రేప్ చేస్తున్నారు' అని మండి పడ్డారు.
|
గరుడ పురాణాన్ని అనుసరిస్తూ పబ్లిగ్గా చంపేయాలి
రష్మి ట్వీట్ మీద పలువురు నెటిజన్లు స్పందించారు. ఇలాంటి దారుణాలు ఆగాలంటే... నేరాలకు పాల్పడిన వారిని అదే ప్రాంతంలో జనం సమక్షంలో చంపేయాలి. వీరిని శిక్షించడానికి గరుడపురాణంలోని పద్దతులను ఉపయోగించాలి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
|
కఠిన చట్టాలు వస్తాయనే నమ్మకం లేదు
మన దేశంలో ఇంకా కఠినమైన చట్టాలు వస్తాయని మీరు నమ్ముతున్నారా? అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అలాంటి చట్టాలు వచ్చేదుంటే మొదటి నేరం జరిగినపుడే వచ్చేవి. ఇన్ని దారుణాలు జరుగుతున్నా రావడం లేదంటే... ఆ విషయంలో మనం ఆశలు వదులుకోవాల్సిందే అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.
|
మరణ శిక్ష వేసినా నేరాలు జరుగుతూనే ఉంటాయి
మరణ శిక్ష వేసినా...ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మారాల్సింది మనుష్యుల ఆలోచన విధానం. మనుషుల్లో మార్పు వచ్చినపుడే ఇలాంటి దారుణాలు జరుగడం తగ్గిపోతుందని మరికొందరు వాదిస్తున్నారు.