Karthika Deepam weekly roundup శౌర్య మనసులో మాటను హిమ తెలుసుకొని.. గత వారం రోజుల్లో ఎన్ని ట్విస్టులో!
కార్తీకదీపం సీరియల్ గత మూడు సంవత్సరాలుగా సుదీర్ఘంగా సాగుతున్నది. ఈ సీరియల్లో రెండో జనరేషన్ మధ్య బంధాలు, అనుబంధాలు ఆసక్తికరంగా మారాయి. ప్రతీ ఎపిసోడ్లో రకరకాల ట్విస్టుతో సీరియల్ జోష్తో ముందుకెళ్తున్నది. గతవారం రోజులుగా అంటే జూలై 18 నుంచి జూలై 23 తేదీ వరకు ఈ సీరియల్ ఎలాంటి మలుపులు తిరిగిందనే విషయంలోకి వెళితే..

జూలై 18వ తేదీ ఎపిసోడ్
శౌర్యకు హిమ దగ్గరయ్యేందుకు శత విధాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే తాను ఎలాగైనా నిరుపమ్, శౌర్యకు పెళ్లి చేస్తానని నానమ్మ, తాతతో చెప్పింది. అయితే హిమ మాటలను చాటుగా విన్న శౌర్య ఒక్కసారి భగ్గుమన్నది. బావతో నా పెళ్లి చేసి నీవు త్యాగశీలివిగా మారిపోదామని అనుకొంటున్నావా? నీ బుట్టలో పడుతానని, నీ మాయలో పడుతానని ఎలా అనుకొంటున్నావు? నీ మీద కోపం పొగొట్టడానికి, బావతో నీ పెళ్లి సాఫీగా జరగడానికి భలే ప్లాన్ చేస్తున్నావుగా.. మీ నాటకం బాగుంది. నీవు గొప్ప మేధావివి. మహానటికే అమ్మమ్మవి. ముఖంలో బాధ నటిస్తున్నావు చూడు.. అబ్బో.. నీ ద్రోహం మర్చిపోను. నీ నటనను నమ్మను అంటూ శౌర్య ఎటాక్ ఇవ్వడం సోమవారం (జూలై 18వ తేదీ) ఎపిసోడ్లో హైలెట్ అయ్యింది.

జూలై 19వ తేదీ ఎపిసోడ్
శౌర్యను పెళ్లి చేసుకోమని హిమ చెప్పడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నిరుపమ్ పడిపోయాడు. ఒకవైపు పెళ్లి తేది సమీపిస్తుండటంతో డాక్టర్ శోభ తన పరిస్థితి ఏమౌతుందోననే బెంగతో సతమతమైంది. ఇక శౌర్య, హిమను కలిపేందుకు సౌందర్య, ఆనందరావు డ్రామాలు ఆడటం మొదలుపెట్టారు. వీరిద్దరిని కలిపేందుకు బోనాల పండగను వేదికగా చేసుకొన్నారు. నిరుపమ్, శౌర్యను దగ్గరగా చేసేందుకు బోనాల కోసం షాపింగ్కు వెళ్లడం మంగళవారం జూలై 19వ తేదీ ఎపిసోడ్లో ప్రధానంగా కనిపించింది.

జూలై 20వ తేదీ ఎపిసోడ్
బోనాల పండుగ షాపింగ్లో మనవరాళ్లతోపాటు ఇద్దరు మనవళ్లు ఉంటే బాగుండేదని ఆనందరావు అంటే.. వెంటనే ప్రేమ్కు హిమ కాల్ చేసి నిరుపమ్ను షాపింగ్కు రప్పించేలా చేసింది. షాపింగ్ పూర్తయిన తర్వాత నిరుపమ్, శౌర్యను ఒకేకారులో కూర్చుండేలా ప్లాన్ చేశారు ప్రేమ్, హిమ. అయితే కారులో వారిద్దరూ అయిష్టంగానే మాట్లాడుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా, అప్పుల్లో కూరుకుపోయిన డాక్టర్ శోభకు బ్యాంక్ రికవరీ ఏజెంట్లు ఫోన్ చేసి హాస్పిటల్ను సీజ్ చేస్తామని బెదిరించడంతో ఆమె కంగారుపడింది.

జూలై 21వ తేదీ ఎపిసోడ్
ఒకే కారులో ప్రయాణిస్తున్న నిరుపమ్, శౌర్య మధ్య మాటలు యుద్ధం జరిగింది. నీ తమ్ముడు అడిగితేనే నేను కారులో కూర్చొన్నాను అంటే.. ఏదో మనసులో పెట్టుకొని మాట్లాడకు అని నిరుపమ్ అంటే.. నీకు ఇష్టం లేకపోతే కారు దిగిపోతానని బెదిరించింది. అంతలోనే ఇంటికి చేరుకోవడంతో వారి మధ్య వాగ్వాదానికి పుల్స్టాప్ పండింది. ఇక బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి నమస్కరించారు. బోనాల జాతర సందర్భంగా డ్యాన్సులు చేస్తూ అమ్మవారి ఆలయానికి చేరుకొన్నారు.

జూలై 22వ తేదీ ఎపిసోడ్
బోనం ఎత్తుకొని సౌందర్య, హిమ, శౌర్య అమ్మవారి ఆలయానికి చేరుకొన్న తర్వాత రికి బోనం సమర్పించారు. పూజారి దీవెనలు అందుకొన్నారు. ఈ అమ్మవారు శక్తి కలిగిన వారు. ఇక్కడ ఆచారం ప్రకారం.. మనసులో ఏదైనా కోరుకొని చీటిపై రాసి కుండలో వేస్తే.. అది తప్పకుండా నెరవేరుతుంది అని అందరూ నమ్ముతుంటారు. కాబట్టి మీరు చీటీలపై ఏవైనా కోరికలు ఉంటే.. మీరు కోరుకోండి అని పూజారి చెబితే.. నా జీవితంలో కోరుకోవడానికి ఏమీ మిగిలి ఉంది అని శౌర్య అనుకొన్నది. హిమ, శైర్యను కలపడమే నా కోరిక అంటూ సౌందర్య మనసులో అనుకొంటూ చీటలను కుండలో వేశారు. అయితే శౌర్య కూడా చీటి రాసి అందులో వేసింది. అయితే శౌర్య ఏం కోరుకొన్నదనే విషయాన్ని తెలుసుకొనేందుకు శౌర్య రాసిన చీటిని చూసింది. అందులో అమ్మా, నాన్న రావాలి అని శౌర్య రాయడం చూసి హిమ షాక్ తిన్నది.

జూలై 23వ తేదీ ఎపిసోడ్
నిరుపమ్ పెళ్లి తేదీ దగ్గర పడుతుండటంతో శోభలో ఆందోళన మొదలైంది. నిరుపమ్ను కలువడానికి ప్లాన్ వేసింది. దాంతో నిరుపమ్, శోభ హోటల్లో కలుసుకొన్నారు. అయితే నిరుపమ్, శౌర్యను కలిపేందుకు సౌందర్య, ఆనందరావు, హిమ, ప్రేమ్ మరో ప్లాన్ వేశారు. తాత అనారోగ్యానికి గురయ్యాడని చెప్పి నిరుపమ్ను పిలిపించారు. అయితే వీరి ప్లాన్ భిన్నంగా ఆటో తీసుకొని శౌర్య బయటకు వెళ్లిపోయింది. నిరుపమ్ వచ్చి తాత ఆరోగ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు.


Click it and Unblock the Notifications











