26/11: ముంబై బ్లాస్ట్ నేపధ్యంలో టీవీ షో

ఇది కేవలం అవగాహన కోసమేనని 'లైఫ్ ఓకే' జనరల్ మేనేజర్ అజిత్ ఠాకూర్ స్పష్టీకరించారు. ఇలాంటి సంఘటనలకు ప్రజలు ఎలా భయభ్రాంతులకు గురవుతారో చూపించేందుకు ప్రయత్నించామని నిర్మాత సంజయ్ వాద్వా చెప్పారు. వాస్తవ సంఘటనల ఆధారంగా సీరియల్ను రూపొందిస్తున్నప్పటికీ కొన్ని కల్పితాలకు చోటిచ్చినట్లు తెలిపారు.సహజత్వానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
ఇందులోని పాత్రల్లో పోలీసుల ప్రవర్తనను నిజాయితీగా చూపించాలని ఇటీవల మాజీ పోలీసు సంచాలకుడు పి.ఎస్.పస్రీచా సూచించారు. దీంతోపాటు ఈ సంఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రం కూడా రాబోతోంది. చిత్ర నిర్మాణం తుది దశలో ఉందని రాంగోపాల్ వర్మ తెలిపారు. ఈ నేపథ్యంలో అండర్ వరల్డ్, జులై 11 తర్వాత 26/11 సంఘటన కూడా చిత్రాల రూపంలో చూసేందుకు వీలుకలుగుతోంది.


Click it and Unblock the Notifications











