నాగ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు': మళ్లీ మొదలు..డిటేల్స్
హైదరాబాద్ : చిన్న తెరపై సంచలనాలు సృష్టిస్తూ.. వీక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న కార్యక్రమం 'మీలో ఎవరు కోటీశ్వరుడు . మొదటి,రెండు సీజన్లు అందించిన ఉత్సాహంతో కనాగార్జున మూడవ సీజన్ మొదలుపెట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ సారి కూడా గతంలో లాగానే స్టార్ ఇమేజ్ కు పెద్ద పీట వేయనున్నారని సమాచారం. అక్టోబర్ నుంచి ఈ షో షూటింగ్ మొదలవుతుంది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
నాగార్జున మాట్లాడుతూ... " నేను 60 ఎపిసోడ్లు ఎక్సపెక్ట్ చేస్తున్నాను . డేట్స్ కూడా ఖరారు అయినట్లే ," అని అన్నారు. ఇందుకోసం ఆయన తాను చేస్తున్న సినిమాలు కూడా పూర్తి చేసుకుని ఖాళీ చేసుకుంటున్నారు.
నాగార్జున కంటిన్యూ చేస్తూ..."ఈ షో నాకు ప్రజల మనస్సులని స్పృశించే అవకాసం కల్పిస్తోంది. నటులుగా మేము కేవలం ఎంటర్టైన్ చేస్తూంటాం...అయితే ఈ షోతో చాలా మంది జీవితాల్లో వెలుగు తెచ్చి వారి ముఖాల్లో నిజమైన ఆనందం కలగ చేసే అవకాసం కలుగచేస్తోంది. ఈ షో ద్వారా నాకు కలుగుతున్న ఆనందాన్ని నేను మాటల్లో వ్యక్తం చేయలేను ," అన్నారు.
స్లైడ్ షోలో... గతంలో ఈ షోలో పాల్గొన్న స్టార్స్ ని చూద్దాం...

విద్యాబాలన్
ఈ షో సీజన్ 2 లో విద్యాబాలన్ పాల్గొన్నారు.

రామ్ చరణ్
ఈ షో లో రామ్ చరణ్ పాల్గొని ఎంజాయ్ చేసారు

అనుష్క
ఈ షోలో నాగార్జున పరిచయం చేసిన అనుష్క సైతం పాల్గొన్నారు

కమల్ హాసన్
ఈ షోలో కమల్ హాసన్ గతంలో పాల్గొని రేటింగ్స్ పెంచారు

ధనుష్
అనేకుడు చిత్రం విడుదల సమయంలో ధనుష్ పాల్గని,ప్రమోషన్ సైతం చేసుకున్నారు

అక్టోబర్ నుంచి
ఈ షో నెక్ట్స్ సీజన్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











