Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
Evaru Meelo koteeswarudu బుల్లితెరపైకి ఎన్టీఆర్ రావడం కష్టమే.. ఫ్యాన్స్కి నిరాశే?
జూనియర్ ఎన్టీఆర్ త్వరలో తెలుగు ప్రేక్షకులను బుల్లితెర ద్వారా పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక రియాలిటీ గేమ్ షో ఒకటి ఆయన హోస్ట్ గా సిద్ధమవుతోంది. అయితే షో జెమిని టీవీలో త్వరలోనే టెలికాస్ట్ కావాల్సి ఉంది. ఇప్పట్లో రాజమౌళి సినిమా ద్వారా ఆయన చూడలేకపోతున్నాం అని బాధ పడుతున్న ఆయన ఫ్యాన్స్ కు ఇది ఒక రకంగా శుభవార్త అని చెప్పాలి.
ఇంకేముంది మరికొద్ది రోజుల్లో తారక్ ను బుల్లితెర మీద చూసుకుందాం అన్న వారి ఆశలు అడియాశలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఈ రియాలిటీ షో టెలికాస్ట్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పరిస్థితి ఏమీ బాలేదు
దానికి కారణం మరేమిటో కాదు తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశాన్ని సైతం మళ్లీ భయపెడుతున్న కరోనా. అవును నిజమే, తారక్ షో ఒకవేళ వాయిదా పడితే దానికి కారణం కరోనా అనే చెప్పాలి. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ లో కి వెళ్ళిపోయే యోచనలో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల మంత్రులు సైతం ప్రస్తుతం పరిస్థితి ఏమీ బాలేదని కేవలం ఆర్థికంగా ఆలోచించి ఇంకా లాక్ డౌన్ లాంటిది విధించడం లేదని కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించడం ఒక్కటే సరైన చర్య అని అభిప్రాయపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ షో వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది.
లక్షల నుండి వందల్లోకి అప్లికేషన్లు
అయితే ఈ షో వాయిదా వెనుక కారణం తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. ప్రస్తుతం ఈ షో కి సంబంధించిన ఆడిషన్స్ జరుగుతున్నాయి. గతంలో ఇలాంటి షోస్ లో పాల్గొనడానికి లక్షల మంది పోటీ పడే వారు. లక్షల అప్లికేషన్ లు ప్రతి రోజూ వచ్చి పడేవి. ఆ వచ్చిన లక్షలాది అప్లికేషన్లలో స్క్రూటినీ చేసి అభ్యర్థులను పిలిచి నేరుగా ముఖాముఖి ఇంటర్వ్యూ చేసి వారి వలన షోకు ఉపయోగం ఉంటుందని తెలిస్తేనే వారిని సెలెక్ట్ చేసేవాళ్ళు.
కానీ ఇప్పుడు కరోనా పూర్తిగా పరిస్థితిని మార్చేసింది. లక్షల అప్లికేషన్లు పక్కన పెడితే ఇప్పుడు వందలో అప్లికేషన్ రావడం మొదలయ్యాయి. అది కూడా అప్లికేషన్ పెట్టారు కానీ ఇప్పుడు ఆడిషన్ కి రమ్మంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది రాలేమని చెబుతూ ఉండడం ఆశ్చర్యకరంగా మారింది..
Recommended Video
నిజంగా డబ్బులు గెలిచినా అవి తమ వరకు రానివ్వరు
అదీగాక ఇలాంటి షో లో నిజంగా డబ్బులు గెలిచినా అవి తమ వరకు రానివ్వరు అనే అపోహ ఉంటుంది. ఇది కూడా జనాలు షోకు రావడం కోసం వెనక అడుగు వేయడానికి ఒక కారణం అనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి షోలలో ప్రతివారం సినిమా ప్రమోషన్లు చేస్తూ ఉండడంతో ఇది కేవలం రియాలిటీ షో మాత్రమేనని ఇక్కడ జనాన్ని ఉద్ధరించే పనులు ఏవీ పెట్టుకోలేదని జనానికి ఒక క్లారిటీ వచ్చేసింది.
అందుకే ఈ కరోనా టైంలో వచ్చి ఆడిషన్స్ లో పాల్గొని కరోనా సోకితే తర్వాత ఇబ్బందులు పడే బదులు ఎలాంటి టెన్షన్ లేకుండా ఇంట్లో కూర్చుని టీవీలో చూస్తే చాలు అనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ షో ఇప్పట్లో టెలికాస్ట్ అవ్వడం అంటే అది కష్టం అనే చెప్పాలి. మరి చూడాలి ఏమవుతుందో అనేది.