Just In
- 26 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
- 51 min ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్కు నిదర్శనం
- 1 hr ago
యాంకర్స్కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 2 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- News
వికారాబాద్లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Finance
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంత..?ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ఎలా చేయాలి..?
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అదరింది: నాగార్జున తో కమల్ హాసన్ ఇలా... (వీడియో)
హైదరాబాద్ : నాగార్జున సూపర్ హిట్ టీవి షో...‘మీలో ఎవరు కోటీశ్వరుడు' సెకండ్ సీజన్ చివరకు వచ్చేసింది. ఈ ఫైనల్ ఎపిసోడ్ ఈ శుక్రవారం 9.30 కు ప్రసార్ కానుంది. ఫస్ట్ సీజన్ కు చిరంజీవి గారు ముగింపు పలికారు. ఇప్పుడు కమల్ హాసన్ ... హాట్ సీట్ లో కూర్చుని ముగింపు ఇస్తున్నారు. ఈ మేరకు స్పెషల్ సెలబ్రటీ ఎపిసోడ్ ప్రోమోను మాటీవి విడుదల చేసింది. మీరూ ఓ లుక్కేయండి ఆ ప్రోమోపై
అరవై సంవత్సరాల వయస్సులోనూ కమల్ హాసన్ చాలా ఫిట్ గా ఉండి..లోక నాయుకుడు అనిపించుకున్నారు. చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్ కు విపరీతమైన రేటింగ్ వచ్చింది. అలాగే కమల్ పాల్గొంటున్న ఈ ఎపిసోడ్ సైతం చాలా బాగా పండుతుందని భావిస్తున్నారు. ఈ సీజన్ సూపర్ హిట్ అయ్యిందని,తన మనస్సుకు బాగా నచ్చిన షో అని నాగార్జున అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ... ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ద్వారా ఆడియన్స్ తో నేరుగా కలిసే అవకాశం లభించింది. వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రతి క్షణం ఎంతగానో ఎంజాయ్ చేశాను. నా మనసుకు దగ్గరైన కార్యక్రమం ఇది అని అని చెప్పుకొచ్చారు. అలాగే....పోటీలలో పాల్గొన్న వారి హుందాతనం, అమాయకత్వం, అంకితభావం, వారి కుటుంబ నేపథ్యం తనను ఎంతో ఆకట్టుకున్నాయని నాగార్జున అన్నారు.

అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ షో దిగ్విజయంగా సెకండ్ సీజన్ ని సైతం పూర్తి చేసుకోవటంతో మాటీవి యాజమాన్యం సైతం చాలా సంతోషంగా ఉంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో కోటి రూపాయల ప్రైజ్ మనీతో ఓ గేమ్ షో ప్రసారం కానుండటం ఇదే ప్రథమం.
ఇంతకాలం సినిమాల ద్వారా వినోదం పంచుతూ వచ్చిన తాను మొదటిసారి టెలివిజన్ తెరపైకి వచ్చానని నాగార్జున అన్నారు. ఒక సామాజిక బాధ్యతతో ఈ గేమ్ షోకు ప్రయోక్తగా వ్యవహరించాననీ, అమితాబ్ ముద్రను అందుకోవడం చాలా కష్టమని తెలుసనీ, తన శక్తివంచన లేకుండా బాగా చేయడానికి కృషి చేసాననీ చెప్పారు. చాలా మంది సామాన్య పౌరుల కలల్ని నిజం చేయడం ద్వారా వారి జీవితాల్ని ఈ షో మార్చుతోందని ఆయన అన్నారు.