Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెలుగు టీవీ ఛానెళ్ళు ముందు నటుల నిరసన
ఈ కార్యక్రమంలో కన్వీనర్, ప్రొడ్యూసర్ నాగబాల సురేష్కుమార్, బెంగుళూరు పద్మ, గుత్తికొండ భార్గవ్, విజయ్యాదవ్ తదితరులు మాట్లాడుతూ అనువాద ధారావాహికలను నిలిపివేయాలని పలు టెలివిజన్ సంస్థలను కోరామని, తమ వినతిని పరిశీలించిన ఈటీవి లాంటి సంస్థలు ముందుకు వచ్చి ఆపుతామని హామీ ఇచ్చారని, కానీ ఇంకా కొన్ని టీవి ఛానెళ్ళనుంచి ఎలాంటి సమాధానం అందలేదని దీంతో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు.
మార్చి 30వ తేదీ వరకు ఇది కొనసాగుతుందన్నారు. 31వ తేదీన తెలుగు టెలివిజన్ షూటింగులు ఉండవన్నారు. ఇందుకోసం బంద్కు పిలుపునిచ్చామన్నారు. ఏప్రిల్ 1వ తేదీనుంచి ధర్నాచౌక్లో ఉగాదివరకు నిరవధిక నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, ఇతర పరిశ్రమల వర్గాలు తప్పనిసరిగా పాల్గొనాలని ఐకాస విజ్ఞప్తి చేస్తోందన్నారు. ఏప్రిల్ 12వ తేదీన నటుడు విజయ్యాదవ్ ధర్నాచౌక్లో ఆమరణ నిరాహారదీక్ష చేయనున్నట్లు తెలిపారు.
అనువాద కళాకారులు, యూనియన్ల వారు కూడా ధారావాహికలకు అనువాదం చెప్పడం ఆపి ఈ ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. పరిశ్రమకు చెందిన ప్రతి వ్యక్తి ఈ కార్యాచరణను అమలు చేయాలని వారు కోరారు. అనంతరం జీటీవీ బిజినెస్ విభాగాధిపతి అనురాధకు వినతి పత్రాన్ని అందజేయగా మూడు నాలుగు రోజుల్లో తమ కార్యాలయ అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయానికి వస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.