Just In
- 8 min ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్పోజింగ్తో చంపేసిందిగా..
- 55 min ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 9 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
- 11 hrs ago
అభిమాని పెళ్లిలో సడన్గా ప్రత్యక్షమైన స్టార్ హీరో.. అతిధులంతా షాక్!
Don't Miss!
- News
కుటుంబమంతా నగ్నంగా పూజలు.. మృతదేహంపై ముగ్గు వేసి... మదనపల్లె కేసులో భయంకర నిజాలు
- Automobiles
ఎలక్ట్రిక్ కారుగా మారిన మారుతి డిజైర్ ; వివరాలు
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరో తెలుగు సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్.. లక్షణాలు లేకపోయినా..
సినిమా ఇండస్ట్రీలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విస్తరిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ లాంటి అగ్ర నటులు కూడా వైరస్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ వైరస్ ఉహీంచని స్థాయిలో దెబ్బ కొడుతోందని సినీ తారలు షూటింగ్స్ కి దూరంగా ఉంటున్నారు. ఇక ఇటీవల మరొక తెలుగు టీవీ ఆర్టిస్ట్ కూడా కరోనా భారిన పడినట్లు తెలుస్తోంది.

స్వాతి చినుకులు యాక్టర్..
స్వాతి చినుకులు, బంధం వంటి సీరియల్స్ ద్వారా తెలుగు జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న భరద్వాజ్ ఇటీవల కరోనా టెస్ట్ చేయించుకోగా అతనికి పాజిటివ్ అని తేలింది. అయితే అతనికి కరోనా లక్షణాలు పెద్దగా కనిపించడం లేదట. అయినప్పటికీ టెస్ట్ చేయించుకోగా వైరస్ ఉన్నట్లు తెలిపాడు. భరద్వాజ్ ఒక వీడియో ద్వారా తనను కలిసిన వారు కూడా టెస్ట్ చేయించుకోవాలని కోరాడు.

లక్షణాలు లేకపోయినా..
భరద్వాజ్ మాట్లాడుతూ..నాకు జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఏమి లేదు. అయినప్పటికీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంలో సమాధానం లేదు. అయితే ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. ఇది నిజంగా దాచాల్సిన విషయం కాదు. స్వాతి చినుకులు, బంధం సీరియల్స్ షూటింగ్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను.

ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోండి
ప్రతి ఒక్కరు మర్చిపోకుండా టెస్ట్ చేయించుకోండి. ఇది బయటకు చెప్పాల్సిన బాధ్యత అందరిలో ఉంది. చుట్టూ పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన ఎవరితో ఉండకూడదు. పానిక్ అవ్వకుండా ముందుజాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. సమయానికి మెడిటేషన్, ఆహారం క్రమంగా తీసుకుంటే ఎలాంటి అపాయం ఉండదు. ఈ విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నెగిటివ్ గా ఉండి ఇతరులను కూడా భయానికి గురి చేయవద్దు.

సోషల్ డిస్టెన్స్ అవసరం..
జాగ్రత్తగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ.. మీ అంతట మీరే జాగ్రత్తగా ఉంటే వైరస్ భారిన పడకుండా ఉండవచ్చని తనకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు భరద్వాజ్ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. భరద్వాజ్ కి కరోనా పాజిటివ్ అని తెలియడంతో బంధం, స్వాతి చినుకులు సిరియాల్ టీమ్ లలో ప్రతి ఒక్కరు టెస్ట్ చేయించుకోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.