Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ తెలుగు టీవీ నటి
కేసు వివరాల్లోకి వెళితే... బంజారాహిల్సకు చెందిన మధు అలియాస్ మదన్ మాదాపూర్లోని ఫార్చ్యూన్ టవర్సలో ఫ్లాట్ నెంబర్ 203ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నడుపుతున్నాడు. సమాచారమందుకున్న ఎస్వోటీ పోలీసులు మంగళవారం ఫార్చ్యూన్ టవర్సపై దాడి చేయగా టీవీ సీరియల్ ఆర్టిస్టు, గుంటూరుకు చెందిన శ్రావణి(23), జీడిమెట్లకు చెందిన 'జయరాజ్ స్టీల్ కంపెనీ' యజమాని సజ్జన్కుమార్ గోయెంక(55) పట్టుబడ్డారు. దాడిని పసిగట్టిన మదన్ పరారయ్యాడు. అతని సహాయకుడు వెంకటరమణ(20)ను పోలీసులు అరెస్టు చేశారు.
టీవీ ఆర్టిస్టుతో ఒక రోజు గడిపేందుకు రూ. లక్ష చెల్లించేలా మదన్, గోయెంక మధ్య ఒప్పందం కుదిరింది. పోలీసులు గోయెంక నుంచి రూ.2 లక్షలు, రెండు సెల్ ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. చూడ్డానికి నీట్ గా ఉండే ఆ భవనంలో ఉన్న ఒక్కో ఫ్లాటు రూ. రెండున్నర కోట్లు పలుకుంది. నెలకు లక్ష రూపాయలు చెల్లిస్తూ ఓ ఫ్లాటును అద్దెకు తీసుకున్న నిర్వాహాకుడు... ఈ బుల్లితెర తారలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. అమ్మాయిల మోజులో అక్కడికి వస్తున్న వారంతా పెద్దపెద్ద వాళ్ళే. ఒక గంట అమ్మాయితో గడుపాలంటే లక్ష రూపాయలు.
వ్యభిచార గృహ నిర్వాహకుడు మధు అలియాస్ మధన్ పరారీలో ఉన్నాడు. వైజాగ్కు చెందిన మధు రెండు మూడు నెలలుగా ఈ ఫ్లాట్ను నెలకు రూ.లక్షకు అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. బడా బాబులు, ప్రముఖులతో సంబంధాలు కలిగి, అందమైన యువతులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మధు, విఠుల నుంచి గంటకు లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడు. నిందితులను పీటీ యాక్టు కింద అరెస్టు చేసిన ఎస్వోటీ పోలీసులు, తదుపరి దర్యాప్తు నిమిత్తం మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. శ్రావణిని రెస్క్యూ హోంకు తరలించారు.
నిర్వాహకుడు మధన్ చిక్కితే మరింత సమాచారం లభిస్తుందని, ఇంకా ఎవవరి పాత్ర ఉందో దర్యాప్తులో వెల్లడవుతుందని గోవర్ధన్డ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో ఫ్లాట్ యజమాని పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్టు చెప్పారు. ఈ ఘటన మాదాపూర్లో సంచలనం రేకెత్తించింది. అంత్యంత సంపన్నులు ఉన్న ఫార్చూన్ టవర్స్లో చీకటి బాగోతం సాగుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు షాక్కు గురయ్యారు.