Don't Miss!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- News వర్షాలపై ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
ఆమె ఘరానా మోసంతో టీవీ ఆర్టిస్టులు లబోదిబో!
కాగా...పోలీసుల విచారణలో విజయరాణికి సంబంధించి పలు షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఆమె ముందస్తు వ్యూహంతోనే ఈ ఘరానా మోసానికి పాల్పడిందని అంటున్నారు. ఈ నెల 10వ తేదీనే ఆమె నివాసం ఉంటున్న ఎల్లారెడ్డిగూడ అద్దె ఇంటిని ఖాళీ చేసిందని, లారీలో సామన్లతో వెళ్లి పోయిందని ఆ ఇంటి యజమాని అంటున్నారు.
ఆమె బంధువుల ఇళ్లకు కూడా తాళాలు ఉండటంతో.....ముందస్తుగా వేసిన ప్లాన్ ప్రకారమే బంధువులను కూడా ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించినట్లు చెబుతున్నారు. దీంతో పాటు శ్రీనగర్ కాలనీ, అమీర్ పేట ప్రాంతాల్లో ఆమె నిర్వహిస్తున్న మూడు మెస్లను ముందుగానే ఖాళీ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
చిట్టీల పేరుతో విజయరాణి గత కొంతకాలంగా టీవీ, సినీ ఆర్టిస్టుల దగ్గర భారీ మొత్తం డబ్బు వసూలు చేస్తూ వస్తోంది. కొన్నేళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తుండటంతో చాలా మందిఆర్టిస్టులు ఆమె వద్ద డబ్బు పోగేసుకుంటున్నారు. గత కొన్నిరోజులుగా విజయరాణి ఆచూకీ లేక పోవడంతో తాము మోసపోయామని గ్రహించిన జూనియర్ ఆర్టిస్టులు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.