Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రేపే చివరి తేది: తెలుగు ఛానెళ్లు పాల్గొంటున్నాయా?
హైదరాబాద్ : తెలుగు టెలివిజన్ ఛానెళ్లలో పిల్లలకు సంబంధించి ప్రసారమయ్యే కార్యక్రమాలను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేయనున్నట్లు యునిసెఫ్ ప్రతినిధులు వెల్లడించారు. హైదరాబాద్ అమీర్పేటలోని ఓ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో యునిసెఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అధ్యక్షుడు రూత్ లియానో, ప్రొసన్ సేన్ తదితరులు మాట్లాడారు.
ఈనెల 6 నుంచి బాలల దినోత్సవమైన నవంబరు 14 వరకు ఛానెళ్లలో ప్రసారమయ్యే బాలల కార్యక్రమాలను ప్రత్యేక కమిటీ పరిశీలింస్తుందన్నారు. తొమ్మిది విభాగాల్లో అవార్డులను అందజేస్తారన్నారు. డాక్యుమెంటరీ(పిల్లల ఆరోగ్యం, విద్య, రక్షణ, బాలల హక్కులు, ఆహార భద్రత, పౌష్టికాహారం), బాలలకు సంబంధించిన చర్చలు, సీరియల్స్, లఘుచిత్రాలు, వార్తా కథనాలు, ప్రజా సేవ, క్లిష్టమైన అంశాలు, స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలు, పిల్లల కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చే ఛానెల్ తదితర అంశాల్లో అవార్డులను అందిస్తారు.
పోటీ పడే ఛానెళ్ల ప్రతినిధులు ఈ నెల 5లోగా నామినేషన్ సమర్పించాల్సి ఉంటుంది. పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ బాలల హక్కులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రసార మాధ్యమాలకు ఉందన్నారు. నేర వార్తల్లో బాలలను చూపించకూడదనే నిబంధనలను కొందరు పాటించడం లేదన్నారు.