Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
2.0 పోటీని తట్టుకునేందుకు ‘టాక్సీవాలా’ న్యూ ఐడియా, 7 నిమిషాల కొత్త సీన్లు!
విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'టాక్సీవాలా' లీక్ సమస్యను సైతం అధిగమించి బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రూ. 35 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది.
నేటి వరకు 'టాక్సీవాలా'కు ఎదురు లేదు. అయితే నవంబర్ 29 నుంచి రజనీకాంత్ 2.0 మూవీ థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్ సరికొత్త ప్లాన్ వేశారు. ఈ సినిమాలో అదనంగా 7 నిమిషాల సీన్లు కలుపుతున్నారు.
హీరో విజయ్ వెంట ఉంటూ కమెడియన్ విష్ణు పోషించిన హాలీవుడ్ క్యారెక్టర్కు సంబంధించి ఈ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఓ వైపు 2.0 ఫీవర్ కొనసాగుతున్న నేపథ్యంలో అదనంగా యాడ్ చేసిన 7 నిమిషాల సీన్లు చూసేందుకు ప్రేక్షకులు ఏ మేరకు ఆసక్తి చూపుతారో చూడాలి.
టాక్సీవాలా చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 35 కోట్ల గ్రాస్... రూ. 20 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలూ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినిమాను కొనుగోలు చేసిన ప్రతి ఒక్క బయ్యర్ డబుల్ ప్రాఫిట్స్ తమ ఖాతాలో వేసుకున్నట్లయింది.