Don't Miss!
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- News భోజనాలున్నాయమ్మా వెళ్లొద్దు.. విజయసాయికి షాక్; ఇజ్జత్ తీసిన టీడీపీ!!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా కోసం కదిలొచ్చిన రాజశేఖర్ కుమార్తెలు.. బర్త్ డే సందర్భంగా సీఎం సహాయనిధికి విరాళం
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రాజశేఖర్ కుమార్తెలు విరాళం అందించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్స్ గా అడుగులు వేస్తున్న వీరు కెరీర్ మొదట్లోనే వారి ఉదారతను చాటుకున్నారు. దొరసాని సినిమాతో రాజశేఖర్ రెండవ కుమార్తె శివాత్మిక హీరోయిన్ గా పరిచయమైన విషయం తెలిసిందే. ఆమె ఒక లక్ష రూపాయలను సీఎం సహాయనిధికి అందించారు.
రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ కూడా మరో లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. నేడు ఏప్రిల్ 22 శివాత్మిక రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో ఇద్దరు సోదరీమణులు కలిసి తెలంగాణ ఐటి శాఖ మంత్రితో సమావేశమయ్యారు. ఇద్దరు వారి విరాళానికి సంబంధించిన చెక్స్ ని మాంత్రి కేటీఆర్ కి అందజేశారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ వారి మాటలతో కూడా అందరి మనసులను గెలుచుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి పాజిటివ్ గా స్పందించారు. తమవంతుగా సహాయం చేయాలని నేడు ఈ విధంగా మీ ముందుకొచ్చాం అంటూ.. ప్రజలందరూ ఇళ్ళల్లోనే ఉంటూ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని,స్టే హోమ్. స్టే సేఫ్" అని వివరణ ఇచ్చారు.