Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
RGV దర్శకుడిగా ఆర్జీవి శిష్యుడు.. అడివి శేష్ చేతుల మీదుగా ఎంతవారుగాని టీజర్
తెలుగు సినిమా పరిశ్రమలో నివాస్ పరిచయం అక్కర్లేదు. క్షణక్షణం, గాయం, గోవిందా గోవిందా, రాత్రి, అంతం, ద్రోహి, మనీ, అనగనగా ఒక రోజు, మృగం, రాత్, మనీ మనీ సినిమాలకు సౌండ్ ఇంజినీర్గా పనిచేశారు. రంగీలాతో ఎడిటర్గా మారి దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. ప్రస్తుతం దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తడానికి సిద్దమయ్యారు. ఎంతవారుగాని అనే సినిమా టైటిల్తో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే...
సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ఎంతవారుగాని. హారర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను, టీజర్ను హిట్ 2 చిత్రంతో భారీ సక్సెస్ అందుకొన్న అడివి శేష్ ఆవిష్కరించారు. సైంటిఫిక్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా పోస్టర్ అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఈ సందర్భంగా అడివి శేష్ ఆకాంక్షిస్తూ.. యూనిట్కు అభినందనలు తెలిపారు.
ఎంతవారుగాని సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూత్, అన్ని వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొనే చిత్రం అని నిర్మాతలు తెలిపారు.
ఎంతవారుగాని చిత్రానికి ప్రవీణ్ కే బంగారి సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ కురాకుల సంగీతం అందిస్తున్నారు. జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఘ్యాని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.