అక్కినేని అఖిల్- పూజా హెగ్డే రొమాన్స్.. ఇదే ఫైనల్!
ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది పూజా హెగ్డే. ఒప్పుకున్న అన్ని సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేసుకుంటూ వస్తున్న పూజా.. అక్కినేని అఖిల్తో రొమాన్స్ ఫినిష్ చేసిందట. ''అఖిల్, హలో, మిస్టర్ మజ్ను'' సినిమాలతో ఆశించిన ఫలితం రాబట్టకపోవడంతో కనీసం నాలుగో సినిమాతోనైనా బ్రేక్ తెచ్చుకోవాలని కసిగా ఉన్న అఖిల్.. తన తాజా సినిమాలో ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీతో తెర పంచుకుంటున్నాడు.
అఖిల్- పూజా హెగ్డే కాంబినేషన్లో రూపొందుతున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి చూపించడంలో సిద్ధహస్తుడైన ఆయన ఈ సినిమాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారట. తాజాగా ఈ సినిమా చివరి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో అఖిల్ - పూజా హెగ్డేలపై రొమాంటిక్ సాంగ్తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారట.

గీతా ఆర్ట్స్ బ్యానర్పై రూపొందుతోన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో అఖిల్ - పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని అంటోంది చిత్రయూనిట్. అతి త్వరలో మిగిలిన ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తిచేసి సినిమాను విడుదల చేస్తామని అంటున్నారు యూనిట్ సభ్యులు.


Click it and Unblock the Notifications











