Just In
- 8 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 9 hrs ago
బాత్ టబ్ పిక్తో రచ్చ.. లైవ్కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 10 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 11 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నాగార్జున డ్రీమ్ ప్రాజెక్టుకు ముహూర్తం ఫిక్స్: ఒకే దెబ్బకు పూర్తయ్యేలా ప్లాన్ చేసేశారుగా!
అక్కినేని నాగార్జున - కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'సోగ్గాడే చిన్ని నాయన'. రెండేళ్ల క్రితం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. తద్వారా అక్కినేని హీరో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో నాగ్ రెండు పాత్రల్లో నటించాడు. అందులో బంగార్రాజు పాత్రకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆయన స్టైల్ను ఎంతో మంది ఫాలో అయిపోయారు కూడా. ఈ కారణంగానే ఈ చిత్రానికి ప్రీక్వెల్ తీయాలని డిసైడ్ అయిపోయాడీ టాలీవుడ్ సీనియర్ హీరో.
'బంగార్రాజు' మూవీ కోసం కల్యాణ్ కృష్ణ ఎప్పుడో స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టేశాడు. దీంతో ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, పలు కారణాల వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈ నేపథ్యంలోనే నాగార్జున కొన్ని సినిమాలతో పాటు బిగ్ బాస్ షోను పూర్తి చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన డ్రీమ్ ప్రాజెక్టును ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకన్నాడట నాగ్. తాజా సమాచారం ప్రకారం.. జనవరి 16న జరిగే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభం అవుతుందట. ఆ వెంటనే రెగ్యూలర్ షూటింగ్ కూడా మొదలు పెడతారని టాక్.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయబోతున్నారని తెలుస్తోంది. దీని కోసం హైదరాబాద్లోనే ప్రత్యేక సెట్ను నిర్మించబోతున్నారని అంటున్నారు. ఇక, ఈ సినిమాలో అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల్లో ఒకరు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం సోలోమన్ దర్శకత్వంలో 'వైల్డ్ డాగ్' అనే సినిమాను చేస్తున్నాడు నాగార్జున. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇందులో ఆయన తొలిసారి ఏఎన్ఐ ఆఫీసర్గా నటిస్తున్నాడు.