Just In
- 10 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 10 hrs ago
పబ్లిక్ ప్లేస్లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్తో భర్తతో శ్రియ రచ్చ
- 11 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 11 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీకి అల్లు అర్జున్ ఫిదా!
నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ'. స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించారు. జూన్ 21న విడుదలవ్వగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
తాజాగా ఈ చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీక్షించారు. ఈ మూవీపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రం చూశాను. కామెడీతో కూడిన మంచి థ్రిల్లర్. కొత్త టాలెంటుతో కూడిన న్యూ జనరేషన్ యాక్టర్లు, డైరెక్టర్లు తెలుగు సినిమా పరిశ్రమలోకి రావడం ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు. థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే వారు తప్పకుండా చూడండి' అని ట్వీట్ చేశారు.

ఈ చిత్రం విడుదలైన 4 రోజుల్లోనే రూ. 6 కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రాఫిట్ జోన్లోకి వెళ్లింది. సినిమా నిర్మాతలు తమ పెట్టుబడి రికవరీ చేసుకోవడంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా సేఫ్ జోన్లోకి వెళ్లారు. రెండో వారంలో సైతం ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టింది.
విజయ్ దేవరకొండతో కలిసి థియేటర్ ఆర్ట్స్ చేయడంతో పాటు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో నటించిన నవీన్ పొలిశెట్టికి హీరోగా ఇది తొలి చిత్రం. తన స్నేహితుడి సినిమాను ప్రమోట్ చేయడానికి విజయ్ దేవరకొండ కూడా ఇటీవల ప్రెస్ మీట్కు హాజరైన సంగతి తెలిసిందే.
ఇపుడు స్వయంగా అల్లు అర్జున్ నుంచి ప్రశంసలు రావడంతో మెగా ఫ్యామిలీ అభిమానులు సైతం ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బాక్సాఫీసు బరిలో సమంత మూవీ 'ఓ బేబీ' ఉంది. మరి దీన్ని నవీన్ పొలిశెట్టి చిత్రం ఏమేరకు తట్టుకుంటుందో చూడాలి.