Don't Miss!
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అల్లు శిరీష్, పూజా హెగ్డేకు నోటీసులు.. పలువురు హీరోలకు ఆ కుంభకోణం ఉచ్చు
దేశవ్యాప్తంగా పలువురు అగ్రహీరోలు మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కాంలో చిక్కుకుపోవడం సంచలన వార్తగా మారింది. క్యూనెట్ అనే సంస్థ చైన్ సిస్టమ్ ద్వారా భారీగా లాభాలు వస్తాయని కస్టమర్లను ఆశచూపి వారిని నట్టేట ముంచింది. కస్టమర్ల నుంచి రూ.100 కోట్ల మేర ఫండ్స్ సేకరించింది. ఈ వారి కుంభకోణాన్ని గుర్తించిన ఓ ఖాతాదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. హాంకాంగ్కు చెందిన విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 'క్యూనెట్' పేరిట భారత్లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది.
ఈ క్యూనెట్ వ్యవహారంలో బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, బోమన్ ఇరానీ తదితరులు ఉన్నారు. తెలుగు హీరో అల్లు శిరీష్, పూజా హెగ్డే పేరు కూడా వినిపించింది. దాంతో ఈ కేసులో షారుక్, అల్లు శిరీష్, పూజా ఇతర సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ఇంకా క్యూనెట్ నుంచి లబ్ది పొందిన కంపెనీలు, వ్యక్తులను కూడా సైబరాబాద్ పోలీసులు విచారించనున్నట్టు సమాచారం.