Don't Miss!
- News సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వెళ్లేవారికి గుడ్ న్యూస్
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
Ramesh Babu Death: రమేష్ బాబు మరణంతో ఆగిన ఈవెంట్.. కీలక ప్రకటన చేసిన యూనిట్
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా రోజులుగా వరుసగా విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. మరికొందరేమో పలు కారణాలతో మరణించారు. దీంతో రెండేళ్లుగా తరచూ ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు అరోగ్య సమస్యలతో శనివారం రాత్రి కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని అభిమానులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఒంటిపై నూలుపోగు లేకుండా ఇలియానా రచ్చ: ఇది మామూలు అరాచకం కాదుగా!
తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు, నిర్మాత అయిన రమేష్ బాబు సుదీర్ఘ కాలం పాటు సినీ రంగానికి సేవలు అందించారు. ఈ నేపథ్యంలో చాలా రోజులుగా పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు కాలేయ సంబంధిత సమస్య వచ్చింది. ఈ కారణంగానే రమేష్ బాబు ప్రాణాలు కోల్పోయారు. ఇక, మరణంపై ఘట్టమనేని ఫ్యామిలీకి చెందిన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు. దీంతో చనిపోయిన తర్వాత ఆయన పేరు ట్విట్టర్లో దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.
రమేష్ బాబు మరణంతో ఈరోజు జరగాల్సిన ఓ ఈవెంట్ కూడా రద్దైంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు హీరోగా పరిచయం అవుతోన్న చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ఇప్పటికే ముమ్మరం చేసేసింది. ఈ క్రమంలోనే ఈరోజు తిరుపతిలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించి.. ట్రైలర్ను లాంచ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు.
షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!
ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో రమేష్ బాబు మరణంతో అది కాస్తా క్యాన్సిల్ అయిపోయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఖాతాలో ఓ ప్రకటనను వదిలింది. అందులో 'రమేష్ బాబు గారి మరణ వార్తను విని షాక్కు గురయ్యాము. ఇది చాలా విచారకరం. ఘట్టమనేని కుటుంబ సభ్యులందరికీ, అభిమానులు, స్నేహితులకు మా ప్రగాఢ సానుభూతిని, ప్రార్ధనలు తెలియజేస్తున్నాము. ఆయన మరణం కారణంగా ఈరోజు తిరుపతిలో జరిగే మా హీరో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను రద్దు చేస్తున్నాము' అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. గల్లా అశోక్, నిధి అగర్వాల్ జంటగా రూపొందిన చిత్రం 'హీరో'. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 15వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. శ్రీరామ్ ఆదిత్య ఈ మూవీకి దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి, సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకు గిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్లకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.