Just In
- 33 min ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరో కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 1 hr ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్పోజింగ్తో చంపేసిందిగా..
- 2 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
- 11 hrs ago
ఎస్సీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్.. గానగంధర్వుడికి ఘన నివాళి
Don't Miss!
- News
నిమ్మగడ్డ అదను చూసి దెబ్బకొట్టారా ? జగన్ కొంపముంచిన నిర్ణయమిదే- టర్నింగ్ పాయింట్
- Sports
మౌమా, సుధా సింగ్తో సహా ఏడుగురికి పద్మశ్రీ
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భీష్మ థర్డ్ సింగిల్: ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే..
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నితిన్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా 'భీష్మ'. 'ఛలో' సినిమాతో సక్సెస్ సాధించి మంచి గుర్తింపు పొందిన దర్శకుడు వెంకీ కుడుముల ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్కి దర్శకత్వం వహించాడు. నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.
ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలు, టీజర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో సినిమాపై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలోనే తాజాగా 'భీష్మ' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ''సరాసరి'' పేరుతో రిలీజైన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ని ఆకట్టుకుంటోంది. శ్రీమణి అందించిన లిరిక్స్పై అనురాగ్ కులకర్ణి పాడిన ఈ పాటకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే.. అంటూ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది ఈ లిరికల్ సాంగ్.
ఫిబ్రవరి 21న రిలీజ్ కాబోతున్న భీష్మ సినిమాకు సంబంధించి ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు ఫినిష్ అయ్యాయి. ఇటీవలే తన డబ్బింగ్ పూర్తిచేసినట్లుగా పేర్కొంటూ రష్మిక ట్వీట్ చేసింది. ఇక ఈ సినిమాలో వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ హైలెట్ అవుతుందని సమాచారం. యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉన్న నితిన్ - రష్మిక జోడీ కట్టడం ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.