Thalaiviకి అనుకోని చిక్కులు.. రిలీజ్ ముందు చీటింగ్ కేసు.. అసలు ఏమైందంటే?
సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా 'తలైవి'. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తుండగా నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్లో నటించారు. అమలాపాల్ మాజీ భర్త ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపు వివిధ బాషలలో రిలీజ్ కాబోతోంది. అనుకోకుండా ఇప్పుడు ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఆ వివరాల్లోకి వెళితే

కరోనా కారణంగా
దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన తలైవి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటించగా అలనాటి నటుడు, ముఖ్యమంత్రి అయిన ఎంజీఆర్ క్యారెక్టర్లో విలక్షణ నటుడు అరవింద్ స్వామి నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించగా.. విబ్రి మీడియా- కర్మ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

అనుకోని చిక్కులు
అయితే తాజాగా ఈ సినిమా సెప్టెంబర్ 10న అంటే రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని ప్రకటించారు మేకర్స్. ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించగా సినిమాకి మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాను తమ మల్టీ ఫ్లెక్స్ లో ఈ సినిమాను విడుదల చేయమని చెప్పడంతో కొంత టెన్షన్ నెలకొనగా ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఇప్పుడు అనుకోని చిక్కులు ఏర్పడ్డాయి.

అక్రమంగా నిధులు
తలైవి సినిమాకు హైద్రాబాద్ నుంచి అక్రమంగా నిధులు తరలించారని అంటున్నారు. ఈ నిధుల మళ్ళింపు విషయంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి , బ్రిందా ప్రసాద్ యాక్సిస్ బ్యాంక్ పై విబ్రి మీడియాకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. తనకు తెలియకుండానే కుట్ర పూరితంగా మోసం చేస్తూ 75 లక్షలు బదిలీ చేశారని ఇచ్చిన ఫిర్యాదులో పెర్కొన్నారు కార్తిక్.

ఆలస్యంగా వెలుగులోకి
2020 ప్రిభవరి 17 మరియు 20 వ తేదిన అవకతవకలు జరిగాయని కార్తీక్ అరోపణ చేశారు. ఐపీసి 405, 406, 415, 417, 418, 420 సెక్షన్స్ పై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు, విబ్రి మీడియా నుంచి విబ్రి మోషన్ ఫిక్చర్స్ కి నిధులు మళ్లించారు పోలీసులు ఈ నెల 6న కార్తీక్ ఫిర్యాదు చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏకకాలంలో మూడు బాషలలో
ఇక ఈ సినిమా ఏక కాలంలో తమిళ, హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రీకరించబడగా ఒకేసారి విడుదల కూడా కాబోతోంది, దీనికి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించగా కేవి విజయేంద్ర ప్రసాద్, మధన్ కార్కీ, రజత్ అరోరా మూడు భాషల్లో కథ మాటలు అందించారు. "తలైవి"ని విబ్రి మోషన్ పిక్చర్స్, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ల పై విష్ణు వర్ధన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ సంయుక్తంగా నిర్మించారు.


Click it and Unblock the Notifications











