Don't Miss!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆన్లైన్లో నితిన్ దర్శకుడికి టోకరా.. గుడ్డిగా నమ్మి డబ్బులు పంపిన దర్శకుడు.. చివరికి..
సైబర్ నేరగాళ్ల నుంచి వీలైనంత దూరంగా ఉండాలి అంటూ పోలీసులు నిత్యం ఎదో ఒక విధంగా వార్తల్లో చెబుతూనే ఉంటారు. అయినప్పటికీ కొందరు అనుకోని విధంగా మోసపోతున్నారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏమి తెలియని వాళ్ళు మోసపోయారు అంటే ఏమో అనుకోవచ్చు. కానీ రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు సైబర్ నేరగాళ్ల వలన మోసపోవడం హాట్ టాపిక్ గా మారింది.
సౌతిండియాలో ఐటమ్ గర్ల్స్ హీరోయిన్లు వీరే... గ్లామర్తో ఇరగదీస్తున్న బ్యూటీలు
దర్శకుడికే సినిమా చూపించారు
ఇక ఆ దర్శకుడు మరెవరో కాదు. ఛలో సినిమాతో బాక్సాఫీస్ హిట్టు కొట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వెంకీ కుడుముల. నితిన్ తో గత ఏడాది భీష్మ సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద హిట్ కొట్టాడు. ఆ రెండు సినిమాలతోనే వెంకీ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది. అయితే ఇటీవల ఈ దర్శకుడికి కొందరు దుండగులు సినిమా చూపించారు.
66 వేలు డిపాజిట్ చేయించుకొని..
వెంకీ కుడుములను నమ్మించి ఏకంగా 66వేల రూపాయలు డిపాజిట్ చేయించుకొని మోసం చేశారు. మరీన్ని డబ్బులు కూడా వేయాలని ఫోన్ కాల్స్ చాలానే వచ్చయట. కానీ దర్శకుడు డబ్బులు కట్టిన తరువాత మోసమని గ్రహించి. పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు భీష్మ అనగానే..
వివరాల్లోకి వెళితే.. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు మన సినిమా వెళుతోంది అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతుంటారు దర్శక నిర్మాతలు. అయితే భీష్మ సినిమాను కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు నామినేట్ చేయనున్నట్లు ఫోన్ కాల్ రావడంతో దర్శకుడి ఎగిరి గంతేశాడు. ఒకటి కాదు రెండు కాదు. ఏకంగా ఆరు కేటగిరీలలో సినిమాను నామినేట్ చేయనున్నట్లు వివరణ ఇవ్వడంతో ఈజీగా నమ్మేశారట.
ఒక్కో కేటగిరీకి రూ.11వేలు
నేను ప్యానల్ సభ్యుల్లో ఒకడిని ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఉందని. మోసగాడు వివరణ ఇవ్వడంతో వెంకీ కూడా నమ్మేశాడు. ఇక ఒక్కో కేటగిరీకి 11వేల రూపాయల చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పడంతో దర్శకుడు వెంకీ మొత్తం 66 వేలు చెల్లిమెచ్చాడు.
మరో కొత్త స్టోరీ చెప్పడంతో..
డబ్బులు చెల్లించిన అనంతరం సైబర్ నెరగడు మరోసారి ఫోన్ చేసి కొత్త స్టోరీ చెప్పాడు. మూడు కేటగిరీలకు సంబంధించిన నామినేషన్ విషయంలో మిస్టేక్ జరిగిందని అంటూ మరికొంత డబ్బులు కూడా చెల్లించాలని చెప్పాడు. ఇక ఫైనల్ గా అనుమానం రావడంతో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతలు దీని గురించి పట్టించుకోవద్దని అన్నారని విషయాన్ని దాట వేశాడు.
కేసు నమోదు చేసిన దర్శకుడు
పూర్తిగా అది సైబర్ నేరగాళ్ల మోసమని తెలుసుకున్న వెంకీ కుడుముల పోలీసులను ఆశ్రయించాడు. సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది జరిగిన మోసంపై కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు అతని నేరగాళ్లు చేసిన ఫామ్ నెంబర్ ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు. వివరాలు సేకరీంచింది దర్యాప్తు కొనసాగిస్తున్నారు.