Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కోన వెంకట్పై చీటింగ్ కేసు.. ఫిర్యాదు ఏమిటంటే..
సినీ రచయిత, దర్శకుడు, మాటల రచయిత కోన వెంకట్పై చీటింగ్ కేసు నమోదైంది. సినిమాకు సంబంధించి తీసుకొన్న అడ్వాన్స్ ఇవ్వడం లేదనే అంశంపై ఆయనపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్లోని మోతీ నగర్కు చెందిన ఆర్వీఆర్వీ ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. జెమిని ఎఫ్ఎక్స్, జేడీఏ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ప్రసాద్ సినిమా కథ కోసం 2017లో రచయిత కోన వెంకట్తో కలిశారు. సినిమా చర్చల్లో భాగంగా కథను ఇస్తానని హామీ ఇవ్వడంతో వారి మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా అడ్వాన్సుగా రూ.15 లక్షల రూపాయలు రెమ్యునరేషన్గా ఇవ్వాలని అడిగితే.. పన్ను మొత్తం కింద కొంత తగ్గించి రూ.13.5 లక్షలు చెక్కు రూపంలో ఇచ్చారు. వాటిని వెంటనే కోన విత్ డ్రా కూడా చేసుకోవడం జరిగింది.
ఆ తర్వాత కథ ఇవ్వకపోవడంతో వారిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం లేకపోయింది. ఓ సారి ఫోన్లో దుర్బాషలాడారు అనే విషయాన్ని ప్రసాద్ పిటిషన్లో పేర్కొన్నారు.
ఇక పలుమార్లు మధ్యవర్తులు సంప్రదించగా.. అమెరికాలో ఉన్నానని చెప్పి తప్పించుకోవడం జరిగిందనేది సీనీ వర్గాల సమాచారం. డబ్బు వెనుకకు తిరిగి ఇచ్చే విషయంలో పలుమార్లు వాట్సాప్లో మెసేజ్లు పంపినా లాభం లేకపోయింది. దాంతో శనివారం బంజారా హిల్స్ పోలీసులకు ప్రసాద్ ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
కాగా, ప్రస్తుతం అమెరికాలో నిశ్శబ్దం అనే చిత్రం షూటింగ్తో కోన వెంకట్ బిజీగా ఉన్నారు. ఆ చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రంలో అనుష్క మూగ పెయింటర్గా కనిపించబోతున్నది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆర్ మాధవన్, షాలిని పాండే, శ్రీనివాస అవసరాల, సుబ్బరాజు, హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మ్యాడ్సన్ తదితరులు నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.