Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
Aryan Khan కు అనన్య పాండే మూడుసార్లు గంజాయి సప్లై?.. ఎన్సీబీ విచారణలో కొత్త విషయాలు
బాలీవుడ్ నటి అనన్య పాండేను విచారిస్తున్న క్రమంలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు రోజులుగా అనన్య పాండేను లోతుగా విచారిస్తున్నట్టు సమాచారం. ఆర్యన్ ఖాన్, అనన్య మధ్య జరిగిన ఛాటింగ్ను ఆధారంగా చేసుకొని విచారణ కొనసాగిస్తున్నట్టు సమాచారం. అయితే ఎన్సీబీ వెల్లడించినట్టు బాలీవుడ్ పత్రికలు, వెబ్ సైట్లు వెల్లడించిన ప్రకారం మూడుసార్లు ఆర్యన్ ఖాన్కు గంజాయి (వీడ్) పంపించినట్టు తెలుస్తున్నది.
గురువారం అనన్య పాండే ఇంటిలో సోదాలు, తనిఖీలు జరిగిన ఎన్సీబీ అధికారులు ఆమె మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకొన్న సంగతి తెలిసిందే. అనన్య ఫోన్లు ఇతర పరికరాలను ఫోరెన్సిక్ శాఖకు పంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అనన్య పాత మొబైల్ను, ఇటీవల కొనుగోలు చేసిన కొత్త మొబైల్ను కూడా స్వాధీనం చేసుకొని విచారణ చెప్పినట్టు తెలిసింది.
అయితే శుక్రవారం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లే ముందు అనన్య పాండే భోరున విలపించారు. ఆమె వెంట తండ్రి చంకీ పాండే వెళ్లారు. ఆయన ఆఫీస్లోని ఫ్రంట్ రూంలో వేచి ఉన్నారు. అధికారులు ప్రశ్నించిన సమయంలో అనన్య పాండే చాలా కామ్గా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది.
వాట్సప్ ఛాట్లో ఆర్యన్ ఖాన్తో జుగద్, వీడ్ అంటూ వాడిన పదాల గురించి అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించినట్టు సమాచారం.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత సినీ తారలతో డ్రగ్స్ లింక్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో భాగంగా వాట్సాప్ ఛాట్స్పై దృష్టిపెట్టిన ఎన్సీబీకి యువ హీరోయిన్ అనన్య పాండే వ్యవహారం బయటపడింది. వాట్సప్ ఛాట్లో ఆర్యన్ ఖాన్, అనన్య పాండే డ్రగ్స్ సమకూర్పు, కోనుగోలు గురించి చర్చించుకొన్నట్టు ఎన్సీబీ అధికారులు ఆరోపించారు. తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను ముంబై కోర్టుకు సమర్పించడం తెలిసిందే.