Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మమ్ముట్టితో ‘యాత్ర’ ముగిసింది... రిలీజ్ ఎప్పుడంటే..?
మమ్ముటితో మా యాత్ర ముగిసింది. 390కి పైగా సినిమాలు, 3 నేషనల్ అవార్డులు, 60కి పైగా కొత్తదర్శకులతో పని చేసిన అనుభవం ఆయన సొంతం. అన్నంటికీ మించి ఆయన గొప్ప మెంటర్, అద్భుతమైన మానవతావాది అంటూ... 'యాత్ర' దర్శకుడు మహి వి రాఘవ్ చెప్పుకొచ్చారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'యాత్ర' షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆయన తన ఫేస్ బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా మమ్ముట్టి గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయన నిరూపించుకోవడానికి కొత్తగా ఏమీ లేదు. ఆయన ఒక లెజెండ్. తెలుగులో స్క్రిప్టు విని, ప్రతి పదం అర్థం అడిగి తెలుసుకున్నారు. ప్రతి అంశం తన బాషలో రాసుకుని ఆ లైన్లను తెలుగులో అద్భుతంగా డెలివరీ చేశారు. ఈ సినిమాకు సొంతగా డబ్బింగ్ చెప్పారు... అని మహి వి రాఘవ్ తెలిపారు.
ఈ పాత్రలో ఆయన తప్ప మరెవరూ సూట్ అవ్వరు అనే స్థాయిలో జీవించారు. అలాంటి గొప్ప నటుడితో కలిసి పని చేయడం నా అదృష్టం అని మహి వి రాఘవన్ వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ రాజారెడ్డి పాత్రలో జగపతి బాబు, సబితా ఇంద్రారెడ్డి పాత్రలో సుహాసిని నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రలను అనసూయ, పోసాని, వినోద్ కుమార్, సచిన్ ఖేడేకర్ పోషిస్తున్నారు.