Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
18 నెలల నిరీక్షణ ఫలించింది.. వాటే థాట్ గురూజీ!
విలక్షణ దర్శకుడు కృష్ణవంశీ ఈ మధ్య కాలంలో సరైన హిట్ అందుకోలేక పోతున్నారు. చివరిగా 2017 లో నక్షత్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత మరో సినిమా ప్రకటించడానికి చాలా సమయమే పట్టింది. ఆయన ఇప్పుడు రంగమార్తాండ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి ముందు నుంచి కూడా చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. నిజానికి రంగమార్తాండ సినిమా ఆగిపోయింది అని కొద్ది రోజుల క్రితం ప్రచారం కూడా జరగగా ఆ వార్తలు అన్నింటినీ ఆయన ఒక ఫోటో తో చెక్ పెట్టారు.
మరాఠి బాషలో సూపర్ హిట్ గా నిలిచిన నటసామ్రాట్ అనే సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఆ సినిమాలో నానా పటేకర్ నటించిన పాత్రను తెలుగో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. ఇక బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ లాంటి వాళ్ళు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అయితే నిజానికి రంగమార్తాండ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద చాలా అంచనాలు నెలకొని ఉన్నాయి. తాజాగా దర్శకుడు కృష్ణవంశీ చేసిన ఒక పోస్ట్ కూడా ఈ సినిమా మీద మరింత అంచనాలు పెంచేసింది.
ఏకంగా 18 నెలల నిరీక్షణ తర్వాత ఒక అదిరిపోయే పల్లవి ఇచ్చారని, మంచి ఆలోచన, వెయిట్ చేసినందుకు అధ్బుతమైన పల్లవి ఇచ్చారంటూ ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాక ఇప్పటిదాకా కామెడీ పాత్రలో నటించిన బ్రహ్మానందం ఈ సినిమాలో మాత్రం గుండెను పిండేసే విధంగా నటించబోతున్నారని ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. అలా ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉండగా ప్రేక్షకుల అంచనాలను ఏమేరకు అందుకుంటుంది, అనేది రిలీజ్ అయితే గాని చెప్పలేం.