Don't Miss!
- News లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మహేష్ బాబు ‘మహర్షి’ : యూఎస్ఏ షెడ్యూల్ కాస్త ఆలస్యంగా
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మహర్షి' మూవీ నెక్ట్స్ షెడ్యూల్ యూఎస్ఏలో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా సెప్టెంబర్ చివరి వారం నుండే ఇక్కడ షూటింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ మొదటి వారం నుండి యూఎస్ఏలోె షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.
ముందుగా ఇక్కడ 60 రోజుల లాంగ్ షెడ్యూల్ అనుకున్నప్పటికీ కొన్ని మార్పులు చేసి 25 రోజుల్లో కంప్లీట్ చేయాలని, న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్ వెగాస్ తదితర ప్రాంతాల్లో ప్లాన్ చేశారు. మిగతా సీన్లను ఇతర లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం డెహ్రడూన్, హైదరాబాద్లో రెండు మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రంలో మహేష్ బాబు రెండు డిఫరెంట్ షేట్స్లో కనిపించబోతున్నారు. కాలేజ్ స్టూడెంట్.... రైతుబిడ్డగా ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నారు. ఇప్పటి వరకు తన కెరీర్లో చేసిన పాత్రలన్నింటికంటే ది బెస్ట్గా ఇందులో మహేష్ బాబు పాత్ర ఉంటుందట.
మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేష్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానకి కేయూ మోహనన్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వై జయంతి మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.