Don't Miss!
- News కేజ్రివాల్, కవిత కస్టడీపై ఢిల్లీ కోర్టు కీలక నిర్ణయం..!
- Sports CSKకి కొత్త సమస్య.. ప్లేఆఫ్స్ చేరాలంటే ఎలా?
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నా డ్రీమ్ ప్రాజెక్టు అదే.. ఆ డైరెక్టర్తో సినిమా చేయాలనుంది: మహేష్ బాబు
ప్రస్తుతం మాంచి ఫామ్ కొనసాగిస్తూ హాట్రిక్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఆయన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ విషయం తెలిపారు. తాను అనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్టుల్లో దర్శక ధీరుడు రాజమౌళితో దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేయడం ఒకటని చెప్పారు.
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపడం, పైగా అది డ్రీమ్ ప్రాజెక్టు అని చెప్పడం సూపర్ స్టార్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ కాంబినేషన్ కోసం తెలుగు ప్రేక్షకలోకం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. ఇప్పుడు మహేష్ స్వయంగా ఈ టాపిక్ తీయడంతో.. రాజమౌళి- మహేష్ కాంబీలో మూవీ వస్తే రికార్డులు బ్రేక్ కావడం ఖాయం అని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.
మరోవైపు మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మంచి టాక్తో దూసుకుపోతూ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక నటించింది. ఇందులో మహేష్ బాబు కామెడీ టైమింగ్, మాస్ ఎలిమెంట్స్, డ్యాన్స్ ఆకట్టుకున్నాయని అంటున్నారు జనం.
13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి నటన సినిమాకు ప్లస్ అయిందని విశ్లేషకులు చెప్పారు. చాలా రోజుల తర్వాత ప్రకాష్రాజ్ విలనిజం కలిసొచ్చిందని టాక్ నడుస్తోంది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమా చూసిన సూపర్ స్టార్ అభిమానులైతే "నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్" అంటూ ఖుషీ అవుతున్నారు.