Bhola Shankar: భోళా శంకర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.. అభిమానుల మాస్ కరువు తీరిపోయేలా!
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ముందు సంగతి ఎలా ఉన్నా రాజకీయాలకు బై చెప్పి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా ప్రాజెక్టులను ప్రకటిస్తున్నారు. రీ ఎంట్రీ తరువాత 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి' అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాను ప్రారంభించి ఇప్పటికే పని పూర్తి చేశారు.
అది సెట్స్ మీద ఉండగా కరోనా లాక్ డౌన్ రావడంతో ఆ సమయంలో మరిన్ని సినిమాలు లైన్లో పెట్టారు. అయితే ఆ సినిమాల్లో భోళా శంకర్ ఒకటి కాగా ఆ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

మెహర్ రమేష్ దర్శకత్వంలో
మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి ప్రకటించిన సినిమాలలో భోళా శంకర్ ఒకటి. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్గా వస్తున్న 'భోళా శంకర్' సినిమా మీద అందరి ఫోకస్ ఉంది. ఎందుకంటే ఈ సినిమా టాలీవుడ్లో ఫ్లాప్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉండడమే.

మాస్ ఎంటర్టైనర్గా
భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్తో పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కీర్తి సురేష్.. చిరంజీవి చెల్లెలుగా కనిపించనున్నారు. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా చిరంజీవి జోడీగా నటిస్తున్నారు.

ఫస్ట్ లుక్ విడుదల
అయితే 'భోళా శంకర్' మూవీ షూటింగ్ మొదలు అయి చాలా రోజులు అవుతుంది. కానీ ఈ సినిమా నుంచి ఒక్క ప్రీ లుక్ తప్ప మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఫస్ట్ లుక్ను మాత్రం చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఇది సరైన సమయం అని
శివునికి మరొక పేరు అయిన శంకర్ టైటిల్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నందున, ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి ఇది సరైన సమయం అని భావించిన మేకర్స్ మార్చి 1వ తేదీన మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఆ లుక్ లో మెగాస్టార్ జీప్ మీద తనదయిన స్టైల్ లో కూర్చుని ఉన్నట్టు చూపించారు. ఒకరకంగా మెగా ఫాన్స్ ఆయనని ఎలా తెరపై చూడాలనుకుంటారో అలానే భోళా శంకర్ ఫస్ట్ లుక్ లో కనిపిస్తున్నారు.

మెగా మాస్ మానియా
'భోళా శంకర్' సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. రామ బ్రహ్మం సుంకర నిర్మాత. ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర ఈ చిత్రాన్నినిర్మాణ బాధ్యతలను చూస్తుకుంటున్నారు.
మహతి స్వర సాగర్ దీనికి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు డూడ్లీ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమాలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ , దివి వాద్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొత్తం మీద ఈ ఫస్ట్ లుక్ తో మెగా మాస్ మానియా మొదలైపోయింది అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











