Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాని, సమంత మళ్లీ జంటగా.. సుధీర్ బాబు కీలక పాత్రలో.. దర్శకుడు ఎవరంటే
ఎటో వెళ్లిపోయింది మనసు, ఈగ చిత్రాలతో ప్రేక్షకుల మదిని దోచుకొన్న నాని, సమంత అక్కినేని మరోసారి జతకట్టనున్నారు. సమ్మోహనం చిత్రంతో ఫీల్గుడ్ చిత్రాలను రూపొందించే దర్శకుడిగా ముద్ర వేసుకొన్న ఇంద్రగంటి మోహనకృష్ణ తదుపరి చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు.
తాను రూపొందించే సినిమాలో హీరోయిన్గా నటించాలని సమంతను ఇంద్రగంటి మోహనకృష్ణ సంప్రదించినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ చిత్రంలో సుధీర్ బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ ఏడాది మరో క్రేజీ ప్రాజెక్ట్కు లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం నాని నటించిన జెర్సీ చిత్రం విడుదలకు ముస్తాబువుతున్నది. ఈ చిత్రంలో నాని క్రికెటర్గా అవతారం ఎత్తనున్నారు. ఇక సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి మజిలి చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఏప్రీల్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.