Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అన్ని ఎమోషన్స్ ఒకేసారి... అభిమాని పనికి నోట మాటరాని హీరోయిన్
వరుణ్ తేజ్ మొదటి చిత్రం 'ముకుంద' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల భామ పూజా హెగ్డే. అయితే ఈ చిత్రం తరువాత బాలీవుడ్కు చెక్కేసింది. అక్కడ అపజయాలు పలకరించడంతో మళ్లీ తెలుగులోనే తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తెలుగు ప్రేక్షకులు మాత్రం పూజా హెగ్డేను ఇష్టపడటం మానలేదు. హరీష్ శంకర్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన డీజే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి.. మంచి విజయాన్ని అందుకుంది.
వరుస ఆఫర్లతో బిజీ..
అనంతరం వరుస అవకాశాలతో టాలీవుడ్లో దూసుకుపోతోంది. తెలుగులో టాప్ హీరోలందరితో ఆడిపాడుతోంది. అల్లు అర్జున్ సరసన 'డీజే, అల వైకుంఠపురములో, ఎన్టీఆర్తో 'అరవింద సమేత' మహేష్ బాబు సరసన ‘మహర్షి'వరుణ్తో ‘వాల్మీకి' చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
|
తాజాగా అల వైకుంఠపురములో..
ప్రస్తుతం పూజా హెగ్డే అల వైకుంఠపురములో విజయాన్ని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే మీడియాతో ఇంటర్ యాక్ట్ అవుతూ చిత్ర విశేషాలను పంచుకుంది. అయితే ఇంత బిజీగా ఉన్నా పూజాకు ఓ అభిమాని నోట మాట రాకుండా చేశాడు. అతను చేసిన పనికి పూజా ఏడిచినంత పని చేసింది. ఇంతకీ అతనేం చేశాడన్నది ఓసారి చూద్దాం.
పచ్చబొట్టు పొడిపించుకున్న ఫ్యాన్
పూజా హెగ్డే పేరును తన చేతిపై పచ్చబొట్టును పొడిపించుకున్న ఆ అభిమాని ఆమెను ట్యాగ్ చేశాడు. అది చూసిన పూజా హెగ్డే ఆశ్చర్యానికి గురైంది. అంతేకాకుండా.. నువ్వు చూపించిన ప్రేమకు థ్యాంక్స్ మాత్రమే చెప్పగలను అంటూ ఓ హగ్ ఎమోజీని, ఏడుస్తున్న ఎమోజీని, లవ్ ఎమోజీని పోస్ట్ చేసింది. ఇలా అన్ని ఎమోషన్స్ను ఒకే సారి చూపించింది బుట్టబొమ్మ.
ప్రభాస్, అఖిల్ సినిమాలతో బిజీగా..
ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ సినిమాలను చేస్తున్నానని తెలిపింది. ప్రభాస్తో చేస్తున్న సినిమా దాదాపు రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయని, మరో షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కాబోతోన్నట్లు తెలిపింది. అఖిల్తో కూడా ఓ సినిమా చేస్తున్నానని, అతనితో వర్క్ చేయడం బాగుందని తెలిపింది.