Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన ధోనీ.. ఒకే ఒక్కడు
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
National Film Awards 2019: జాతీయ అవార్డు రావడం హ్యాపీగా ఉంది.. నాగ్ వెన్నెముకలా : రాహుల్ రవీంద్రన్
సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్పై సుశాంత్, రుహానీ శర్మ హీరో హీరోయిన్గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం చి.ల.సౌ. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను విడుదల చేసింది. గత ఏడాది ఆగస్ట్లో సినిమా విడుదలైంది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం గత ఏడాది చాలా పెద్ద విజయాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డును సొంతం చేసుకుంది.
ఈ
సందర్భంగా...
రాహుల్
రవీంద్రన్
మాట్లాడుతూ
-
మా
చి.ల.సౌ
చిత్రానికి
బెస్ట్
ఒరిజనల్
స్క్రీన్
ప్లే
అవార్డ్
రావడం
ఆనందంగా
ఉంది.
ఈ
సందదర్భంగా
అమ్మానాన్నకు,
నా
భార్య
చిన్మయికి,
నా
సోదరుడికి
థ్యాంక్స్
చెబుతున్నాను.
నేను
ఉద్యోగం
వదిలేసి
వచ్చి
సినిమాల్లో
ప్రయత్నిస్తానని
చెప్పగానే
వాళ్లు
ఎంకరేజ్
చేశారు.
సపోర్ట్
అందించారు.
నేషనల్
అవార్డ్
జ్యూరీకి
స్పెషల్
థ్యాంక్స్.
చిన్న
సినిమా
తీశామని
నేను
అవార్డ్
కోసం
సినిమాను
పంపాం
..మరచిపోయాం.
కానీ
ఇప్పుడు
అవార్డ్
రావడం
మరచిపోలేని
ఆనందాన్ని
ఇస్తుంది.
సుశాంత్
ఈ
సినిమా
కథను
నమ్మడంతో
జర్నీ
స్టార్ట్
అయ్యింది.
అలాగే
రుహాని
శర్మ,
సిరుని
సినీ
కార్పొరేషన్
అధినేతలు
సహా
ఈ
చిత్రంలో
నటించిన
ఆర్టిస్టులు,
సాంకేతిక
నిపుణులకు
థ్యాంక్స్.
అలాగే రిలీజ్ సమయంలో నాగ్ గారు బ్యాక్బోన్లా నిలబడ్డారు. అదే మాకు పెద్ద ప్లస్ అయ్యి సినిమా రీచ్ పెరిగింది. మాతో పాటు చాలా తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చాయని విన్నాం. ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్. తెలుగు సినిమాకు ఇది గొప్ప ఏడాది. తెలుగు సినిమాతో పాటు అవార్డులను అందుకున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.
కాగా, ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం ప్రకటించారు. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ అవార్డుల విజేతలను ప్రకటించారు. కాగా ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 'మహానటి', 'రంగస్థలం', 'అ!', చిలసౌ' చిత్రాలకు అవార్డులు దక్కాయి. తెలుగు నుంచి ఉత్తమ చిత్రంగా మహానటి ఎంపికైంది. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ విభాగంలోనూ మహానటి ఖాతాలో అవార్డులు చేరాయి.